Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తీర్పు అనంతరం కోర్టులో ఏడ్చేసిన సల్మాన్ ఖాన్
హైదరాబాద్: హిట్ అండ్ రన్ కేసులో దాదాపు 13 ఏళ్లుగా సల్మాన్ ఖాన్ విచారణ ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఈ రోజు ఆయనకు ఈ కేసు నుండి విముక్తి లభించింది. ముంబై హైకోర్టు సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు విన్న వెంటనే సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ కన్నీళ్లు పెట్టాడు. ఏళ్లతరబడి దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను ఎట్టకేలకు నిర్దోషిగా తేలడంతో ఎమోషన్ అయ్యారు. దు:ఖం ఆపుకోలేకపోయాడు.
ఒకరి ప్రాణాలు బలిగొని, నలుగురిని గాయ పరిచిన హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మే 6, 2015న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును సల్మాన్ తరుపు న్యాయవాది ముంబై హైకోర్టులో సవాల్ చేసి విజయం సాధించారు. సరైన సాక్ష్యాలు లేనందున సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఈరోజు(డిసెంబర్ 10)న తీర్పు వెలువరించింది.
సల్మాన్ ఖాన్ తాగి కారు నడిపాడనటానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని, అందువల్ల ఈ కేసులో సల్మాన్ను దోషిగా నిర్ధారించలేమని కోర్టు వెల్లడించింది. సల్మాన్పై అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు తీర్పునిచ్చింది. క్రింది కోర్టు తీర్పును హైకోర్టు తప్పుబట్టింది.
ప్రాసిక్యూషన్ సాక్షాల్లో లొసుగులున్నాయని హైకోర్టు పేర్కొంది. కేవలం ఊహాగానాలతో సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చమని హై కోర్టు పేర్కొంది. సెషన్స్ కోర్టు సరిగా విచారించలేదని తెలిపింది. ఈ తీర్పుతో సల్మాన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు జరుపుకుంటున్నారు.