Don't Miss!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
హీరోయిన్ సమంత గుర్రం ఎక్కింది!
హైదరాబాద్: ‘ఏ మాయ చేసావే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సమంత ఆ చిత్రం విజయం సాధించడంతో వరుస అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో టాప్ హీరోయిన్గా ఎదిగింది. గత మూడు నాలుగేళ్లుగా కొనసాగుతున్న సమంత హవా తాజాగా తగ్గుముఖం పట్టించింది. కొత్త హీరోయిన్ల రాక ఇందుకు ప్రధాన కారణం.
సినిమా రంగంలో ఎక్కవ కాలం నిలదొక్కుకోవాలంటే కేవలం అందం, అభినయం మాత్రమే కాదు....ఇతర ఎక్స్ట్రా టాలెంటు కూడా అవసరం. ఈ విషయాన్ని గ్రహించిన సమంత గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. దీంతో పాటు యాక్షన్, ఇతర అంశాల్లో కూడా శిక్షణ తీసుకునేందుకు రెడీ అవుతోంది.
సమంత సినిమాల విషయానికొస్తే...తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య, ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు దశలో ఇందులో ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నిత్యామీనన్, అదా శర్మ కూడా నటిస్తున్నారు. దీంతో పాటు తమిళంలో ఓ సినిమా చేస్తోంది
ఎప్పటినుంచో తమిళంలో ఓ హిట్ కొట్టాలన్న సమంత కోరిక తాజాగా ‘కత్తి' హిట్తో తీరింది. దీంతోనైనా తమిళంలో అవకాశాలు వస్తాయని ఆశగా చూస్తోంది. త్వరలో పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటానని కూడా స్టేట్మెంట్లు ఇస్తోంది. లవ్లో పడ్డానని, అతని గురించి అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటానంటోంది. తన నోటి ద్వారా మాత్రం ఇంతవరకూ చెప్పకపోయినా అందరికీ తెలిసిపోయిన సిద్ధార్థ్తో ప్రేమాయణం సంగతి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.