Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తుఫాన్ బాధితులకు సంపూర్ణేష్ బాబు సాయం
హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధుతుల కోసం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోలంతా తమవంతు సహాయం చేయడానికి ముందు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కామెడీ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చాడు. తన వంతు సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. లక్షల సహాయం ప్రకటించారు. అంతే కాదు ప్రభావిత ప్రాంతాల్లో మంచి నీరు, పాలు, పళ్లు, మెడిసిన్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం టాలీవుడ్ హీరోలైన పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షల విరాళం, మహేష్ బాబు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. మరో వైపు జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ చెరొక 20 లక్షల చొప్పున విరాళం అందించారు. మరో వైపు రామ్ చరణ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షలు, విశాఖలోని రామకృష్ణ మిషన్ కోసం రూ. 5 లక్షలు విరాళం అందించారు.
శాటిలైట్ సిస్టం హెచ్చరికలతో హుధూద్ తుఫాన్ గురించి ముందే తెలియడంతో అంతా ముందుగానే అప్రమత్తం అయ్యారు. దీంతో ప్రాణ నష్టం జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంగో పెనుగాలులు వీయడంతో ఆస్తి నష్టం భారీగా ఏర్పడింది.
ఈ రోజు ప్రధాన మంత్రి మోడీ విశాఖలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం తరుపున తక్షణ సహాయం కింద రూ. 1000 కోట్ల సహాయం ప్రకటించారు. హుధూద్ తుఫాన్ బాధితుల కోసం సినీ తారలతో పాటు, తెలుగు వారంతా తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.