twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తుఫాన్ బాధితులకు సంపూర్ణేష్ బాబు సాయం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధుతుల కోసం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోలంతా తమవంతు సహాయం చేయడానికి ముందు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కామెడీ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చాడు. తన వంతు సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. లక్షల సహాయం ప్రకటించారు. అంతే కాదు ప్రభావిత ప్రాంతాల్లో మంచి నీరు, పాలు, పళ్లు, మెడిసిన్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

    ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం టాలీవుడ్ హీరోలైన పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షల విరాళం, మహేష్ బాబు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. మరో వైపు జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ చెరొక 20 లక్షల చొప్పున విరాళం అందించారు. మరో వైపు రామ్ చరణ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షలు, విశాఖలోని రామకృష్ణ మిషన్ కోసం రూ. 5 లక్షలు విరాళం అందించారు.

    Sampoornesh Babu donated Rs.1 lakh

    శాటిలైట్ సిస్టం హెచ్చరికలతో హుధూద్ తుఫాన్ గురించి ముందే తెలియడంతో అంతా ముందుగానే అప్రమత్తం అయ్యారు. దీంతో ప్రాణ నష్టం జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంగో పెనుగాలులు వీయడంతో ఆస్తి నష్టం భారీగా ఏర్పడింది.

    ఈ రోజు ప్రధాన మంత్రి మోడీ విశాఖలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం తరుపున తక్షణ సహాయం కింద రూ. 1000 కోట్ల సహాయం ప్రకటించారు. హుధూద్ తుఫాన్ బాధితుల కోసం సినీ తారలతో పాటు, తెలుగు వారంతా తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

    English summary
    Hero Sampoornesh Babu donated Rs.1 lakh for the Cyclone victims. He also announced that he will supply Water, Milk, Fruits and Medicines for the victims in the affected areas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X