Don't Miss!
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
సంజయ్ దత్ మొదటి భార్య చనిపోతూ రాసిన లేఖ ఇదే..
ముంబై: గత కొన్ని నెలలుగా జైలు జీవితం గడుపతున్న బాలీవుడ్ నటుడు సంజయ్దత్ సత్ర్పవర్తన మీద ఇటీవల జైలు నుండి విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుండి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని రోజులుగా సంజయ్ దత్ ఇంటికి బంధువులు, స్నేహితులు, సన్నిహితుల రాకపోకలతో సందడి వాతావరణం నెలకొంది.
సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ కుమార్తె త్రిషాల కూడా సంజయ్ జైలు నుంచి రావడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. సంజయ్ మొదటి భార్య రిచా శర్మ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ మరణించింది. అప్పుడు త్రిషాలకు ఎనిమిదేళ్లు. తల్లి చనిపోతూ చివరిగా రాసిన లేఖను త్రిషాల ఇటీవల సోషల్మీడియా ద్వారా రిలీజ్ చేసారు. 21 ఏళ్ల కిందట తాను ఈ ఉత్తరాన్ని చూశానని, జీవితం చాలా చిన్నదంటూ పోస్ట్ చేశారు. 'అమ్మను మిస్సయ్యా'ను అంటూ తల్లితో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
'మనం అందరం కలిసి నడుస్తాం. కానీ ఎవరిదారి వారే చూసుకుంటారు. నేనూ నా దారి చూసుకున్నా. ఆ దారి మరణానికి దగ్గరగా ఉంది. నేను ఎలా వెనక్కు రాగలను? నాకు మరో అవకాశం ఉంటుందా? కాలమే వీటన్నింటికీ సమాధానం చెబుతుంది. ఎంత కాలమైనా ఎదురు చూస్తా. వెనక్కు వచ్చే దారి లేదని నాకు తెలుసు. ఇప్పటికీ నాకు ఆశ ఉంది. ఓ దేవదూతా.. నా కలలు ఉన్న చోటకు నన్ను తీసుకెళ్లు. అందుకోసం ఎదురు చూస్తా. నన్ను జాగ్రత్తగా చూసేందుకు వాళ్ల రెండు చేతులు చాచి నన్ను ఆహ్వానిస్తున్నారు' అని రిచా శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు.
రిచా శర్మ మరణం తర్వాత సంజయ్ దత్ 1998లో మోడల్ రియా పిళ్లైని రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ 2005లో మనస్పర్థల కారణంగా విడిపోయారు. అనంతరం 2008లో నటి మాన్యతను మూడో వివాహం చేసుకున్నారు. సంజయ్, మాన్యత దంపతులకు ఇద్దరు సంతానం.