Don't Miss!
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
బన్నీ అదరగొట్టాడు: ‘సరైనోడు’ ఫస్ట్ టీజర్ ఇదే (వీడియో)
హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా అల్లు అరవింద్ నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ టీజర్ ఈ రోజు 4 గంటలకు విడుదలైంది. టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్లో బన్నీ పెర్ఫార్మెన్స్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాననుకున్నావేమో...మాస్ ఊరమాస్’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ అభిమానులకు తెగనచ్చేసింది. లుక్ పరంగా కూడా బన్నీ గత సినిమాలకంటే భిన్నంగా....మాస్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.
టీజర్ విడుదల తర్వాత పబ్లిసిటీ ఉధృతం కాబోతోంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ, బెంగుళూరు ఏరియాల్లో ఉన్న దాదాపు 1000 థియేటర్లలో ఈ టీజర్ శుక్రవారం నుండి ప్రదర్శించబోతున్నారు. టీజర్ విషయంలోనే అల్లు అరవింద్ ఈ రేంజిలో హడావుడి చేస్తున్నారంటే.... సినిమా విడుదల ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
వామ్మో..! అల్లు అరవింద్ విశ్వరూపం చూపిస్తున్నాడు!
టాలీవుడ్ బడా నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఆయన తలుచుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా చేయగలరు. ఆయనకు ఇండస్ట్రీలో అంత ఇన్ ఫ్లూయెన్స్ ఉంది. మరి అలాంటి వ్యక్తి స్వయంగా తాను నిర్మిస్తున్న సినిమా, పైగా తన కొడుకు అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో......తన పలుకుబడి అంతా ఉపయోగించబోతున్నారు. సినిమా రిలీజ్ విషయంలో తన విశ్వరూపం చూపించబోతున్నారు.
తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ జన్మదినం సందర్భగా ఏప్రిల్ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.