Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
అఖిల్ దెబ్బకి టాలీవుడ్ నుండి ఔట్...మళ్లీ అక్కడ తేలింది!(ఫస్ట్ లుక్)
హైదరాబాద్: అక్కినేని వారసుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖిల్' చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఈ సినిమా దెబ్బకి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. సినిమా రిలీజ్ ముందు ఎంత హైప్ వచ్చిందో... రిలీజ్ తర్వాత అంత పాతాలానికి పడిపోయింది.
ఇదే సినిమా ద్వారా హిందీ నటుడు దిలీప్కుమార్ మనవరాలే సాయేషా సైగల్ తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా రిలీజ్ ముందు హైప్ చూసి సాయేషా కూడా తెగ సంబర పడిపోయింది. తన తొలి సినిమా భారీ హిట్టవుతుందనే నమ్మకం పెట్టుకుంది. కానీ ఆమె ఆశలు అడియాశలైపోయాయి.
'అఖిల్' దెబ్బకి అమ్ముడు టాలీవుడ్ నుండి ఔట్ కాక తప్పలేదు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఎక్కడా సాయేషా పేరు వినిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు అమ్ముడు హిందీలో తేలింది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'శివాయ్'తో సాయేషా హీరోయిన్ గా బాలీవుడ్ కు పరిచయం కాబోతోంది.
తాజాగా సాయేషా లుక్ కూడా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. బాలీవుడ్లో అమ్మడుకి ఇదే తొలి సినిమా. ఈ సినిమాపై సాయేషా చాలా ఆశలు పెట్టుకుంది. మరి ఆమెకు అదృష్టం ఏ మేరకు కలిసొస్తుందో తెలియాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే.