Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభాస్ ప్రవర్తన అలా ఉండేదా? ఐటం బ్యూటీ ఏం చెప్పింది?
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి హాట్ అండ్ సెక్సీ ఐటం గర్ల్ స్కార్లెట్ విల్సన్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రభాస్ చాలా సిగ్గరి, అతను చాలా రిజర్వుగా ఉంటారని, బాహుబలి షూటింగులో ఆయనతో మాట కలపడానికి మూడు రోజుల సమయం పట్టిందని చెప్పుకొచ్చింది.
రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బహుబలి చిత్ర షూటింగులో భాగంగా ఐటం సాంగ్ చిత్రీకరించారు. ప్రభాస్తో పాటు స్కార్లెట్ విల్సన్, నోరా ఫతేహి, స్నేహా ఉపాధ్యాయలతో ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ ఐటం సాంగ్ చిత్రీకరణ సాగింది. ఈ ఐటం సాంగ్ చిత్రీకరించటానికి ఎనిమిది రోజులు పట్టిందట.
ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం యూనిట్ సంప్రదాయబద్దంగా గుమ్మిడికాయ కొట్టే తంతుని నిర్వహించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగా మే నెలలో విడుదల కానుంది. తెలుగులో సినిమా చరిత్రలోనే ఇదొక అద్భుతమైన చిత్రంగా చెబుతున్నారు.
ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అత్యంత భారీ బడ్జెట్తో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'బాహుబలి'. బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది. సత్యరాజ్, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్.