Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
వెన్నెల కిషోర్ కాలు లాగుతున్న సీనియర్ నటుడు(ఫొటో)
హైదరాబాద్ : బ్రహ్మానందం ఆధ్వర్యంలో ఇలా వెన్నెల కిషోర్ కాలు పట్టుకుని బ్రహ్మాజీ లాగుతున్నాయుడు. రీసెంట్ గా జరిగిన ఈ సరదా సన్నివేశాన్ని కెమెరాలో బంధించి వెన్నెల కిషోర్ ట్విట్టర్ ద్వారా మనకు అందించారు. ట్వీట్ చేస్తూ... మార్నింగ్ నుంచీ ఇలా నన్ను లాగుతున్నాడు అన్నారు. అయితే ఇది జస్ట్ సరదాగా నవ్వుకోవటానికే మాత్రమే ఇలా షేర్ చేసారు.
వెన్నెల కిషోర్ వంటి టాలెంటెడ్ కమెడియన్ ఇండస్ట్రీలో పలు సంవత్సరాలుగా నవ్విస్తున్నాడు. కామెడీని పలికించడంలో, పంచ్ డైలాగుల విషయంలో వెన్నెల కిషోర్ ది భిన్నమైన శైలి. ఈ యువ కమెడియన్ తాజా చిత్రం ‘అలా ఎలా?' సినిమా నిన్న విడుదలైంది. ఈ సినిమాలో కిషోర్ నటన అందరినీ ఆకట్టుకుంది
భార్యా బాధితుడిగా వెన్నెల కిషోర్ పండించిన కామెడీ సూపర్ హిట్ అయ్యింది. రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మల్టీప్లెక్స్ వర్గాల ప్రశంసలు పొందుతుంది. అన్నీష్ కృష్ణ దర్శకుడు.
అలాగే...రస్తుతం టాలీవుడ్ ఫేమస్ కమెడియన్స్ లో ఒకరుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న కమెడియన్ వెన్నెల కిషోర్. 2005 లో ‘వెన్నెల' సినిమాతో కమెడియన్ గా పరిచయమైన వెన్నెల కిషోర్ ఇప్పుడు దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా కనిపిస్తున్నాడు. తన ఇన్నేళ్ళ కెరీర్ లో తను కన్న కల ఇప్పుడే నెరవేరబోతోంది.
ఆ కల ఏంటా అనుకుంటున్నారా.? అదేమిటంటే వెన్నెల కిషోర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. కానీ ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వెన్నెల కిషోర్ కి రాలేదు. కానీ తాజాగా అతని కల నెరవేరింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘గోపాల గోపాల' సినిమాలో వెన్నెల కిషోర్ కి అవకాశం వచ్చింది. ఈ సినిమాలో కిషోర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
వెంకటేష్ సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని(డాలీ) డైరెక్టర్. సురేష్ బాబు - శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.