Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ట్విట్టర్లో సెల్యూట్ సెల్ఫీని పంచుకున్నాడు
ముంబై: స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తన సెల్యూట్ సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎటువంటి స్వార్థం లేకుండా దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Salute
2
r
Armed
Forces,
who
selflessly
risk
their
lives
2
protect
our
beloved
country
&
our
families.
#SaluteSelfie
pic.twitter.com/0jvUGPeMDB
—
Shah
Rukh
Khan
(@iamsrk)
August
10,
2015
పంద్రాగస్టు సందర్భంగా కొద్ది రోజుల క్రితమే సినీ, క్రీడా ప్రముఖులు ట్విట్టర్లో సెల్యూట్ సెల్ఫీ అనే కొత్త విధానానికి నాంది పలికిన విషయం తెలిసిందే.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఉవ్వెత్తిన ఎగిసి,దూసుకుపోతున్న ఫేస్బుక్ ఓ కొత్త యాప్ని ప్రవేశ పెట్టింది. అయితే కేవలం సెలబ్రిటీలకు మాత్రమే ఈ యాప్ని వినియోగించుకునే వీలుంటుంది. దాని ద్వారా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు లైవ్ వీడియో ద్వారా తామేం చేస్తున్నదీ అభిమానులతో పంచుకోవచ్చు. ఈ కొత్త అప్లికేషన్ పేరు 'ఫేస్బుక్ మెన్షన్స్'.
దీన్ని భారత్లో పరీక్షించడంలో భాగంగా ఫేస్బుక్ సంస్థ షారుఖ్తో ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఈ యాప్ని భారత్లో వినియోగిస్తున్న మొదటి సెలబ్రిటీగా ఆయన రికార్డులకెక్కారు. ఇకపై ఈ యాప్ ద్వారా ఆయన తన అభిమానులకు లైవ్ వీడియోలతో టచ్లో ఉండనున్నారు.
తొలివిడతగా 15 వీడియోలు పోస్ట్ చేశారు. అందులో షారుఖ్ అభిమానులకు తన తదుపరి చిత్రం 'ఫ్యాన్' సెట్స్ని, చిత్ర యూనిట్ పరిచయం చేశారు. తనని ఫ్యాన్గా చూపిస్తున్న ఆస్కార్ విజేత అయిన మేకప్ మ్యాన్ గ్రెగ్క్యానమ్ని కూడా ఆయన పరిచయం చేశారు.