Don't Miss!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రైల్వే స్టేషన్లో ఆస్తులు ధ్వంసం: షారుక్ ఖాన్ మీద కేసు నమోదు!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మీద రాజస్థాన్ లో కేసు నమోదైంది. రాజస్థాన్ లోని కోటా రైల్వే స్టేషన్లో ఆస్తులు ధ్వంసం అయిన ఇష్యూలో రైల్వే పోలీసులు ఈ కేసు నమోదు చేసారు.
కోటా : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మీద రాజస్థాన్ లో కేసు నమోదైంది. రాజస్థాన్ లోని కోటా రైల్వే స్టేషన్లో ఆస్తులు ధ్వంసం అయిన ఇష్యూలో రైల్వే పోలీసులు ఈ కేసు నమోదు చేసారు. షారుక్ స్వయంగా ఆస్తుల ధ్వంసానికి పాల్పడక పోయినా.... ఆయన వల్లే ఇదంతా జరిగింది అనేది ప్రధాన ఆరోపణ.
షారుక్ ఖాన్ తన తాజా చిత్రం 'రాయీస్' ప్రమోషన్లో భాగంగా ఆ మధ్య రైల్ యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా రాజస్థాన్ లోని కోటా రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆయన్ను చూసేందుకు చాలా మంది అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ వ్యాపారం చేసుకుంటున్న వర్తకుల ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు పలువురు గాయపడ్డారు.
జనవరి 23న క్రాంతి రాజ్ ధాని ఎక్స్ ప్రెస్ లో షారుక్ ఖాన్ కోటా రైల్వేస్టేషన్ కు వచ్చారని, బోగి వద్ద ఆగిన ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారని, అభిమానుల్లోకి షారుక్ ఏదో విసరడంతో దాన్ని తీసుకోవడానికి వారు ఎగబడ్డారని, దీంతో స్టేషన్లో విధ్వంసం ఏర్పడిందని, తనకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయని, విక్రమ్ సింగ్ అనే వ్యాపారి ఆరోపించారు.
విక్రమ్ సింగ్ ఫిర్యాదు మేరకు షారుక్ మీద కేసు పెట్టాలని రైల్వే కోర్టు సూచించడంతో జీఆర్పీ సిబ్బంది కేసు నమోదు చేసారు. అతడిపై ఐపీసీ 427, 120(బి), 147, 149 సెక్షన్లతో పాటు, రైల్వే చట్టంలోని 145, 146, 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.