Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా పిల్లల్ని నేనే తినేస్తానని భయంగా ఉంది: షారుక్
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ట్విట్టర్లో విచిత్రమైన కామెంట్ చేసారు. నాలో రహస్యంగా దాగి ఉన్న భయం బయటపెతున్నాను. నాకు రాత్రి పూట నడిచే అలవాటు ఉంది. ఆ సమయంలో నా పిల్లలు ఎదురు పడితే తినేస్తానేమో. ఎందుకంటే వారు కొరుక్కు తినాలనింపించేంత ముద్దుగా ఉంటారు. వాళ్లను తినేస్తానని భయంగా ఉంది అంటూ షారుక్ ట్వీట్ చేసారు.
I
have
this
secret
fear
that
one
nite
while
I
am
sleep
walking
I
will
eat
up
my
kids...because
I
find
them
sooo
edible.
Slurp
slurp...
—
Shah
Rukh
Khan
(@iamsrk)
August
16,
2015
షారుక్ తాజా సినిమా ‘దిల్ వాలె' సినిమా విషయానికొస్తే...రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజోల్ షారుక్ కు జోడీగా నటిస్తోంది. డిసెంబర్ 18న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకుగాను కాజోల్ కు రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫాంలో ఉన్న బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కత్రినా, కరీనా, ప్రియాంక చోప్రా లాంటి వాళ్లకు మాత్రమే ఈ రేంజిలో పారితోషికం ఉంది. అసలు ఫాంలో లేని, వయసు పైబడిన కాజోల్ కు ఈ రేంజిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం చర్చనీయాంశం అయింది.
కాజోల్ కు ఉన్న ఇమేజ్, టాలెంట్ తో పోలిస్తే ఇంత మొత్తంలో పారితోషికం ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదని పలువురు అంటున్నారు. మరో వైపు షారుక్-కాజోల్ జోడీ అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి, సినిమాపై క్రేజ్ ఏర్పడుతుంది. అందుకే ఆమెకు ఇంత మొత్తంలో పారితోషికం ఆఫర్ చేసారని అంటున్నారు. ఈ చిత్రంలో షారుక్-కాజోల్తో పాటు వరుణ్ ధావన్ - కృతి సనన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి-గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రిస్ మస్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని రోహిత్ శెట్టి చెబుతున్నారు.