Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కంటికి గాయం: ఏం గుచ్చుకుందో తెలియదన్న శ్రద్ధా కపూర్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ కంటికి గాయమైంది. రాక్ ఆన్-2 చిత్రం షూటింగ్ కోసం శ్రద్ధా మేఘాలయ వెళ్లింది. షూటింగ్ జరుగుతుండగా తన కన్ను నొప్పింగా ఉందని శ్రద్ధా చిత్ర యూనిట్కు తెలిపింది. ఈ క్రమంలో శ్రద్ధా స్థానికంగా ఉన్న కంటి డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకుంది.
అయితే కార్నియాపై గీతలు వచ్చినట్లు డాక్టర్ తెలిపాడు. మెరుగైన చికిత్స కోసం చిత్ర దర్శకుడు రితేశ్ సిద్వానీ శ్రద్ధాను ముంబైకి పంపించాడు. ఇక రాక్ ఆన్-2 షూటింగ్ మరో రెండు నెలల పాటు మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోనే జరుగుతుందని దర్శకుడు తెలిపాడు.
షిల్లాంగ్లో షూటింగ్ జరుగుతుండగా తన కంట్లో ఏదో గుచ్చుకుందని, అదేమిటో గుర్తించలేకపోయానని, నిమిషాలు గడుస్తుండగానే నొప్పి తీవ్రమైందని శ్రద్ధా కపూర్ చెప్పింది. లోకేషన్లో ఉన్నవాళ్లంతా తన వద్దకు వచ్చారని, ఓదార్చే ప్రయత్నం చేశారని చెప్పింది.
కొద్దిసేపటి తర్వాత తనను కారులో ఆస్పత్రికి తీసుకుని వెళ్లారని, పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్ కనుగుడ్డు స్వల్పంగా చిట్లిందని చెప్పారని అన్నారు. మెరుగైన వైద్యం కోసం ముంబై రాక తప్పలేదని, విమానాశ్రయం నుంచి నేరుగా తమ ఫ్యామిలీ ఐ స్పెషలిస్టు వద్దకు వెళ్లానని శ్రద్ధా వివరించింది.
రెండు రోజుల చికిత్స తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిందని, ఇంకో మూడు రోజులు విశ్రాంతి తీసుకుని షిల్లాంగ్ వెళ్తానని చెప్పింది.