Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
షాక్: స్టార్ హీరో మోకాలికి సర్జరీ,ఆపరేషన్ జరిగేటప్పుడు వీడియో ఇది
ముంబయి: సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్, ఫైటింగ్ సన్నివేశాల కోసం నటీనటులు చాలా కష్టపడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఊహించని విధంగా గాయపడుతుంటారు. తాజాగా హీరో జాన్ అబ్రహం కూడా ఇలాగే గాయపడి సర్జరీ చేయించుకున్నారు.
తన ట్విట్టర్ ఖాతా ద్వారా జాన్ అబ్రహం ఈ విషయం తెలుపుతూ.. ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు అభిమానుల నుంచి ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. జాన్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
When we say "blood and sweat" goes into a film..we mean it.On my way to 3 knee surgeries while shooting for @Force2thefilm #cameoutstronger pic.twitter.com/3FADatz6dp
— John Abraham (@TheJohnAbraham) November 7, 2016
ఈ వీడియోలో ఆయన మోకాలికి వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్న దృశ్యాలున్నాయి. 'ఫోర్స్-2' చిత్రీకరణ సమయంలో మోకాలికి మూడు సర్జరీలు చేయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
'సినిమా చేస్తున్నప్పుడు మేము రక్తాన్ని, స్వేదాన్ని చిందిస్తామనడానికి నిదర్శనం ఇది. 'ఫోర్స్-2' సినిమా చిత్రీకరణ సమయంలో నా మోకాలికి 3 సర్జరీలు చేయించుకున్నా' అని జాన్ అబ్రహం ట్వీట్ చేశారు.
2011లో విడుదలైన 'ఫోర్స్' చిత్రానికి సీక్వెల్గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తున్నారు. అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విపుల్ అమృత్లాల్ షాహ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబరు 18న 'ఫోర్స్-2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. . చిత్రం ట్రైలర్ ని విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఫోర్స్ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ మూవీలో ప్రముఖ నటి జెనీలియా కీలక పాత్రలో కనిపించనున్నట్లు చిత్రయూనిట్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో వెంకటేశ్ నటించిన 'ఘర్షణ' కు రీమేక్గా ఫోర్స్ ను తెరకెక్కించారు. సోనాక్షిసిన్హా ఇటీవలే అకీరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.