Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ తెలుగు క్లాసికల్ హిట్ ని మరోసారి బాలీవుడ్ లో రీమేక్ చేస్తారట
దక్షిణాది దిగ్గజ దర్శకుల జాబితాలో ముందు వరుసలో ఉండే పేరు బాలచందర్. కమల్ హాసన్, సరిత హీరో హీరోయిన్లుగా 1978లో ఆయన తెరకెక్కించిన చిత్రం "మరో చరిత్ర". అప్పటికే రంగుల చిత్రాలు విరివిగా వస్తున్న సమయంలో నలుపు-తెలుపులో విడుదలైన మరో చరిత్ర సినిమా సంచలన విజయం సాధించింది. అలనాటి క్లాసికల్ చిత్రాల్లో ఒకటి గా ఈ విషాదాంత ప్రేమకథ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. బాలు-స్వప్న లు గా కమల్ హసన్, సరిత లు అత్యద్బుత నటనతో "మరో చరిత్ర" ని క్లాసికల్ గా నిలబెట్టాయి.
1981లో ఇదే సినిమాను ఎల్.వి.ప్రసాద్ హిందీలో "ఏక్ దూజె కే లియె" అన్న పేరుతో పునర్నిర్మించాడు. హిందీలో కమల్ హాసన్, రతి అగ్నిహోత్రి నటించారు. హిందీలో పాటలు కూడా బాలు పాడాడు. హిందీ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ తెలుగు సినిమా డబ్బింగ్ లేకుండా తమిళనాడులో విడుదలయ్యి మద్రాసు (చెన్నై) లో సంవత్సరంపాటు ఆడింది.
అలాంటి సినిమాని ఇప్పుడు రీరీమేక్ చేయడానికి "ఏక్ దుజే కే లియే"లోనే హీరోయిన్గా నటించిన రతి అగ్నిహోత్రి ప్రయత్నిస్తున్నారు. హీరోగా ఎవరో కాదు ఆమె కుమారుడు తనూజ్ విర్వాణి ని పరిచయం చేస్తూ ఈ క్లాసిక్ని పునర్నిర్మించాలని అగ్నిహోత్రి అనుకుంటున్నారట. ఇప్పటికే "మరోచరిత్ర" నిర్మాతలైన ప్రసాద్ పొడ్రక్షన్స్ నుండి హక్కులను తీసుకుని స్క్రిప్ట్ను కూడా ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేయిస్తున్నారట. ఆమె సొంత నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే యేడాది ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్ళనుంది.