Don't Miss!
- News టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి మరీ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా శృతి హాసన్
హైదరాబాద్: మహిళ పట్ల చూపుతున్న వివక్ష, లైంగిక హింస, దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న కాంపెయిన్లో హీరోయిన్ శృతి హాసన్ కూడా పాలు పంచుకోబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ ఫర్హాన్ అక్తర్, రణవీర్ సింగ్, యువరాజ్ సింగ్, అనుష్క శర్మ, సునిధి చౌహాన్, నేహా ధూపియా లాంటి వారు ఈ కాంపెయిన్లో భాగంగా కాగా తాజాగా శృతి హాసన్ కూడా చేరారు.
‘రీచ్ ఫర్ ది స్కై' పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి శృతి హాసన్ తన పూర్తి మద్దతు ప్రకటించారు. దీనిపై శృతి హాసన్ మాట్లాడుతూ...‘మహిళల పట్ల చూపుతున్న వివక్ష, దాడులు, దారుణాలు, అత్యాచారాలకు అడ్డకట్ట వేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మహిళా శక్తి ఏమిటో నిరూపించాలి. అందుకు అందరం కలిసి కట్టుగా పని చేయాలి' అని శృతి హాసన్ అన్నారు.
దీంతో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా శృతి హాసన్ తన మద్దతు ప్రకటిస్తూ కాంపెయిన్స్లో పాల్గొంటోంది. ఎయిడ్స్ వ్యాధిపై జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు, చైల్డ్ ఎడ్యుకేషన్పై చైతన్యం లాంటి కార్యక్రమాలు చేపడుతోంది. కాశ్మీర్ వరద బాధితుల కోసం ముంబైలో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో కూడా శృతి హాసన్ పాలు పంచుకుంది.
ప్రస్తుతం శృతి హాసన్ తమిళ చిత్రం పూజై షూటింగులో బిజీగా గడుపుతోంది. ఈచిత్రంలో ఆమె విశాల్ సరసన నటిస్తోంది. ఈచిత్రం తెలుగులో ‘పూజ' పేరుతో విడుదల కానుంది. దీంతో పాటు ‘వెల్ కం బ్యాక్' అనే హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది.