Don't Miss!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సీనియర్ నటి ఇంట్లో దొంగతనం..పోలీస్ ధర్యాప్తు
హైదరాబాద్ :ఒకప్పుడు హీరోయిన్ గా వెలిగి తర్వాత అబ్బాయిగారు వంటి చిత్రాల్లో కీలకమైన పాత్రలు చేసి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న నటి జయచిత్ర. తాజాగా జయచిత్ర ఇంట్లో 25 కిలోల వెండి వస్తువును దొంగతనం జరిగింది. ఈ మేరకు పోలీస్ కంప్లైంట్ చేసారు.
వివరాల్లోకి వెలితే... జయచిత్ర చెన్నైలో ని నుంగంబాక్కం, మహాలింగపురంలో నివసిస్తున్నారు. ఈమె తన ఇంటి ఎదుట ఓ వినాయక ఆలయాన్ని నిర్మించారు. సన్నిధిలోని వినాయక విగ్రహానికి 25 కిలోల అలంకరణ వస్తువులను వితరణ చేశారు. పూజలు పూర్తయిన తర్వాత ఈ వెండి వస్తువులను ఆమె తన ఇంటి పూజగదిలో దాచేవారు.
కొన్ని రోజుల కిందట మహాలింగపురంలోని ఇంటికి తాళం వేసి.. నుంగంబాక్కంలోని ఇంటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో 24వ తేది నుంచి వెండివస్తువులు కనిపించకుండా పోవడంతో ఆమె శుక్రవారం రాత్రి నుంగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
పూర్తి వివరాల్లోకి వెళితే...
25 కిలోల వెండి వస్తువుల అపహరణ చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రముఖ సినీ నటి జయచిత్ర ఇంట్లో 25 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు ఆమె మేనేజర్ గణేష్ చెన్నై నుంగంబాకం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహలింగపురంలోని జయచిత్ర ఇంటిప్రవేశ ద్వారం వద్ద వినాయక ఆలయాన్ని నిర్మించారు.
విశేష దినాల్లో వినాయకుని ప్రత్యేక అలంకరణకు వెండికవచం తదితర సామగ్రిని వినియోగిస్తుంటారు. ఈ ఆలయంలోని పూజారి వెండి వస్తువులను పూజానంతరం ఇంటిలో భద్రం చేస్తారు. సుమారు 9 లక్షల విలువైన ఈ వెండి సామగ్రి కనిపించకుండా పోయాయని ఈనెల 24వ తేదీన గుర్తించారు. సిబ్బందిని, పూజారిని విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.