Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
"ఎన్టీఆర్కు థాంక్స్...పవన్ కళ్యాణ్ అంటే అభిమానం"
హైదరాబాద్: తమిళ హీరో శింబుకు తెలుగులో హీరోగా పెద్దగా కలిసి రాక పోయినా....సింగర్గా తన టాలెంట్ చూపిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా' చిత్రంలో డైమండ్ గాళ్ అనే పాట పాడిన శింబు...పోటుగాడు చిత్రంలోనూ ఓ పాట పాడారు.
ఇటీవల జరిగిన ‘సైమా' అవార్డుల్లో బాద్ షా చిత్రంలోని పాటకు టగాను శింబు ఉత్తమ గాయకుడు అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ, "ఈ పాట పాడే అవకాశాన్ని ఇచ్చినందుకు ఎన్టీఆర్ కి, తమన్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ అవార్డుని మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షంలో అందుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది. అలాగే, తెలుగులో నా అభిమాన నటుడు పవన్ కల్యాణ్. ఆయనకి కూడా ఓ పాట పాడాలనుంది" అన్నాడు.
శింబు సినిమాల విషయానికొస్తే...తన మాజీ ప్రియురాలు నయనతారతో కలిసి పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఐదు నమ్మ ఆలు' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇద్దరూ ఫాంలో ఉన్న స్టార్స్ కావడం....పైగా మాజీ లవర్స్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో ఇద్దరూ రియల్ లైఫ్ ప్రేమలో ఉన్నపుడు తెరపై రొమాన్స్ బాగా పండించేవారు. రెచ్చిపోయి హాట్ హాట్ సీన్లలో నటించే వారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని