Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్.... విలన్ విషయంలో అయోమయం!
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.... పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆది త్వరలో షూటింగులో జాయిన్ అవుతాడని టాక్.
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని రోజూ 12 గంటల పాటు కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ అండ్ టీం.
కాగా...ఈ సినిమాలో విలన్ ఎవరనే విషయమై అయోమయం నెలకొంది. నిన్నటి వరకు ఇందులో విలన్ పాత్రలో సోనూ సూద్ కనిపించబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలు రావడానికి కారణం ఇటీవల ఓ ముంబై పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను త్రివిక్రమ్ మూవీలో కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు సోనూ సూద్ వెల్లడించడమే.
సోనూ సూద్ లేడంటూ ప్రకటన
అయితే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీ యూనిట్ మాత్రం ఈ సినిమాలో సోనూ సూద్ నటించడం లేదని ఓ అఫీసియల్ అనైన్స్ మెంట్ ఇచ్చారు. మరి సోనూ సూద్ ఆ ఇంటర్వ్యూలో అలా ఎందుకు చెప్పాడో తెలియదు. త్రివిక్రమ్ గత సినిమాలైన జులాయి, అతడు చిత్రాల్లో సోనూ సూద్ విలన్ పాత్రలు చేసిన సంగతి తెలిసిందే.
మరి విలన్ ఎవరు?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.... ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆది త్వరలో షూటింగులో జాయిన్ అవుతాడని టాక్.
అక్కడ హీరో, ఇక్కడ విలన్
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడైన ఆది తమిళంలో హీరోగా రాణిస్తున్నాడు... అయిత తెలుగులో హీరోగా ఎస్టాబ్లిష్ కాక పోవడంతో ఇక్కడ విలన్ పాత్రలు చేస్తూ తన సత్తా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరైనోడు మూవీలో విలన్ పాత్రలో ఆది ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
హీరోయిన్లు
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్లాన్ చేసిన సినిమా ఏప్రిల్ 3 నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మానియేల్ హీరోయిన్లు.
పవన్ రెమ్యూనరేషన్
ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కాకుండానే ప్రొడక్షన్ కాస్ట్ రూ. 75 కోట్లు వరకు అవుతుందట. త్రివిక్రమ్ తాను అనుకున్న విధంగా లావిష్ గా ఈ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడని,అందుకే ఇంత ఖర్చు అని టాక్. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ కాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ లో 30% వాటా తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.