Don't Miss!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Sports DC vs SRH: అందుకే ఉనాద్కత్ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఎస్పీ బాలుకు కేరళలలో అవార్డు
తిరువనంతపురం: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేరళ ప్రభుత్వం అందించే హరివరాసనమ్ పురస్కారాన్ని స్వీకరించారు. శనివారం శబరిమలలో పురస్కార ప్రదానోత్సవం జరిగింది. కేరళ మంత్రి వీఎస్ శివకుమార్ చేతుల మీదుగా బాలసుబ్రహ్మణ్యంకు పురస్కారంతో పాటు రూ.లక్ష నగదు బహుమతి అందజేశారు.
ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ''నా జీవితంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నాను. కానీ హరివరాసనమ్ పురస్కారం ప్రత్యేకమైంది. ఈ పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉంద''ని తెలిపారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
హరివరాసనం అవార్డు కింద రూ.లక్ష నగదుతోపాటు జ్ఞాపికను అందజేయనున్నారు. గతంలో ఈ నగదు బహుమతి రూ.50,000 ఉండగా దీనిని రూ.లక్షకు పెంచారు. గాయకుడిగా వివిధ భాషల్లో అనేక భక్తి పాటలు ఆలపించినందుకుగాను కేరళ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక హరివరాసనం అవార్డుకు ఎంపిక చేసింది.
శబరిమల అయ్యప్ప స్వామి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా భక్తి పాటలను ఆలపించడంతోపాటు వివిధ భాషల్లో అనేక భక్తి గీతాలు ఆలపించి ఆధ్యాత్మిక చింతనను, దేశ సంస్కృతిని, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పి కళారంగంలో చేసిన సేవలకు గాను కే జయశంకర్ నేతృత్వంలోని కేరళ అత్యున్నత స్థాయి కమిటీ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.