Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మాజీ క్రికెటర్ శ్రీశాంత్...తెలుగు సినిమా విశేషాలు!
హైదరాబాద్: నిషేదానికి గురైన క్రికెట్ శ్రీశాంత్ తెలుగు సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ‘స్నేహ గీతం' ఫేం మధుర శ్రీధర్ ఈచిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో శ్రీశాంత్ హీరోగా నటిస్తున్నాడు. షిరిడి సాయి కంబైన్స్ బేనర్లో ఎంవికె రెడ్డితో కలిసి మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగస్టులో మొదలవుతుందని తెలుస్తోంది. షూటింగ్, ప్రొస్టు ప్రొడక్షన్ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే శ్రీశాంత్ పలు టీవీ షోల్లో నటించాడు. తనపై పడ్డ ఫిక్సింగ్, నిషేదం మచ్చను తొలగించుకోవడానికి శ్రీశాంత్ ట్రై చేస్తున్నాడు. అందులో భాగంగానే అతడు సినిమాల బాట పట్టాడు. మరో విషయం ఏమిటంటే శ్రీశాంత్ త్వరలో తండ్రి కాబోతున్నాడు.
శ్రీశాంత్ ఇప్పటికే ఓ మళయాల చిత్రంలో గెస్ట్ రోల్ చేసాడు. పలు సందర్భాల్లో తెలుగు సినిమాల్లో పని చేయాలని ఉందంటూ వ్యాఖ్యలు చేసాడు. క్రికెట్ ద్వారా తపై పడ్డ మాయని మచ్చను......ఈ సినిమా రంగంలో ప్రవేశించడం ద్వారా తుడిచేసుకోవాలని ప్రయత్నిస్తున్న శ్రీశాంత్ ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.