Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సిద్దార్ద మీదా ఎటాక్..భయపడతాడా?
హైదరాబాద్ : తమిళ్ లో సుందర్.సి దర్శకుడిగా తెరకెక్కించిన హారర్ చిత్రం 'అరణ్మనై' .. చిత్రం గతంలో తెలుగులో 'చంద్రకళ' పేరుతో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దాంతో అదే ఉత్సాహంతో ఈ దర్శకుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'అరణ్మనై 2' ను రూపొందించాడు. ఇప్పుడు ఈ సినిమాని 'కళావతి' టైటిల్ తో ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు.
ఈ చిత్రం కథలో జమీందార్ (రాధారవి) తను ఉంటున్న గ్రామంలో కుంభాభిషేకం ప్లాన్ చేస్తాడు. ఆ గ్రామంలో ఉన్న జనాలు నమ్మకం ఏమిటంటే..కుంభాభిషేకం జరిగితే దేముడు కన్ను తెరుస్తాడని, దాంతో ఊళ్లో ఉన్న దుష్ట శక్తి అనేది పారిపోతుందనీను. దాంతో భారీ ఎత్తున కుంభాభిషం కు ప్లాన్ చేస్తారు. అయితే ఊహించని ట్విస్ట్ వచ్చి పడుతుంది.
ఏర్పాట్లు పూర్తయ్యే సరికి ఓ దుష్టశక్తి జమీందారు కోటలోకి ప్రవేశించి ఆయన్ను చంపటానికి ప్రయత్నం చేస్తుంది. దాంతో ఆయన కోమాలోకి వెళ్లిపోతాడు. ఈ సంఘటనతో ఆయన బంధువులు అంతా అక్కడకి వస్తారు. వాళ్ళతో పాటు ఆ జమీందారు కుమారుడు మురళి(సిద్దార్) కూడా వస్తాడు.
అతనితో పాటు అనిత(త్రిష) కూడా ఆ భవంతికి వస్తుంది. అయితే అసలు ఈ మిస్టరీ ఏమిటీ అని ఛేదిస్తూంటే..దీని వెనక ..అనిత సోదరి కళ(హన్సిక) ఉందని , ఆమె చనిపోయిందని బయిటపడుతుంది. ఈలోగా కళ ఆత్మ...సిద్దార్ధని, త్రిషను కూడా చంపటానికి ప్రయత్నిస్తుంది... ఇంతకీ కళ ఎవరు...ఆమె ఎందుకు చనిపోయింది..కుంభాభిషేకం జరిపారా అనేది మిగతా సినిమా .