Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'ఉయ్యాల జంపాల' హీరోతో సుకుమార్ చిత్రం
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇప్పటికే చక్కిలిగిలి టైటిల్ తో తన శిష్యుడు వేమారెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు నిర్మాతగా తన రెండో ప్రొడక్షన్ కు కూడా రంగం సిద్దం చేసేసారు. గతంలో కరెంట్ చిత్రం రూపొందించిన సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మంచి టీమ్ ను ఇచ్చారు. పూర్తి వివరాలు...
సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, రవీందర్.. అందరూ పెద్ద సినిమాలకు పనిచేసినవాళ్లే. ఇప్పుడు వీళ్లంతా కలసి ఓ సినిమా రూపొందిస్తున్నారు. సుకుమార్ నిర్మాతగా మారి తొలి అడుగు వేస్తున్నారు. 'ఉయ్యాల జంపాల'తో ఆకట్టుకొన్న రాజ్తరుణ్ హీరోగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షీనా బజాజ్ హీరోయిన్ .
విజయ్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి, సుకుమార్ నిర్మాతలు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే నెల 9 నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ ప్రేమకథకు సుకుమార్ స్వయంగా స్క్రీన్ప్లే అందిస్తున్నారట. చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు, కళ: రవీందర్
నిర్మాతగా
సుకుమార్
మొదటి
చిత్రం
విషయానికి
వస్తే...
సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా మహీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. టి.వేమారెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సీహెచ్.నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు
సుకుమార్ మాట్లాడుతూ ''నేను, వేమారెడ్డి, ప్రకాష్ ఒకే గదిలో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించేవాళ్లం. మాలో ఒకరు దర్శకుడు కావాలని కలలుగనేవాళ్లం. అలా మా ముగ్గురి కలలు నేటితో నెరవేరాయి. సినిమా పట్ల తపన కలిగిన హీరో సుమంత్ అశ్విన్. నిర్మాతలు కూడా నాకు ఆత్మీయులు. అందరూ కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం తప్పకుండా ఫలితాన్నిస్తుందని నమ్ముతున్నా'' అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''ఇదొక ప్రేమకథ. కొత్త తరహాలో సాగుతుంది. ఈ సినిమా ప్రారంభం కావడానికి ఎమ్.ఎస్.రాజుగారు ఎంతో తోడ్పాటునందించారు. '' అన్నారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ''కథని చాలా తెలివిగా తీర్చిదిద్దారు..సినిమా చాలా బాగా వస్తోంది. '' అని అన్నారు.