Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ట్రైలర్ అదిరింది...అంచనాలు పెరిగాయి (వీడియో)
హైదరాబాద్ : ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్ ఇవే ఈనాటి ప్రేక్షకుడుని థియోటర్ వైపు అంచనాలను పెంచి రప్పించే ప్రచార సాధానాలు. అందుకే మేకర్స్ దృష్టి వాటిపై పూర్తిగా పెడుతున్నారు. ప్రత్యేకంగా టీజర్స్ కట్ చేసేందుకు నిపుణులు సైతం పరిశ్రమలో మనుగడ సాగిస్తున్నారంటే పరిస్ధితి అర్దం చేసుకోవచ్చు. అది ప్రక్కన పెడితే... రీసెంట్ గా... సుకుమార్ శిష్యుడు వేమారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'చక్కిలిగింత' థియోటర్ ట్రైలర్ విడుదలైంది. చూసిన వారందరూ చాలా బాగుందంటున్నారు. దాంతో చిత్రంపై అంచనాలు సైతం పెరిగాయి. ఆ ట్రైలర్ మీరూ చూడండి...
ట్రైలర్ ని బట్టి ఇదో రొమాంటిక్ కామెడీ అని అర్దమవుతోంది. అమ్మాయిలంటే పడని ఓ కుర్రాడు ఓ అమ్మాయితో ప్రేమలో పడి...ఎలా ఆమె ప్రేమను సాధించాడన్నది కథగా రూపొందిందనిపిస్తోంది. సుమంత్ అశ్విన్, రెహానా జంటగా మహిస్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. రచయిత వేమారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సి.హెచ్.నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల నిర్మాతలు.
సుకుమార్ మాట్లాడుతూ ''నేనూ, వేమారెడ్డి, మరో దర్శకుడు ప్రకాష్ తోలేటి ఒకేసారి మా ప్రయాణం ప్రారంభించాం. కష్టసుఖాలు పంచుకొన్నాం. వేమారెడ్డి ఇప్పుడు దర్శకుడిగా మారడం సంతోషంగా ఉంది. పాటలు విన్నాను.. బాగున్నాయి. సినిమా పేరు ప్రచార చిత్రమూ ఆకట్టుకొన్నాయి''అన్నారు.
''ఇంతమంచి కథ, సాంకేతిక నిపుణుల బృందం దొరకడం నా అదృష్టం. భవిష్యత్తులో ఈ చిత్రబృందం మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా మంచి సినిమాలు తీస్తుందన్న నమ్మకం ఉంది''అన్నాడు అశ్విన్. ''రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు దర్శకుడు.
లవర్స్ చిత్రం ద్వారా కమర్షియల్ విజయాన్ని అందుకున్న సుమంత్ అశ్విన్ ప్రస్తుతం రచయిత వేమారెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రంలో నటిస్తున్నాడు. మ్రితిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహి ఎంటర్టైన్మెంట్ పతాకంపై సీహెచ్.నరసింహాచారి, ఇలవల నరసింహారెడ్డి నిర్మిస్తున్నారు. ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
చైతన్యకృష్ణ, సప్తగిరి, జోష్ రవి, వైవా హర్ష, వేణు, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: సాయి శ్రీరామ్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్.