Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగ్ హీరోయిన్ని లైంగికంగా..., మోడీ, సచిన్, బిగ్కి లేఖ
ముంబై: దేశంలో రోజు మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు నత్యకృత్యం అయిపోయాయి. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో క్యాబ్ ఎక్కిన యువతిపై డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన మరోసారి దేశాన్ని కుదిపేసింది. ఈ సంఘటన నేపథ్యంలో నటి షెనాజ్ ట్రెజరీ వాలా తన ఈ సమాజంలో ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టింది. షెనాజ్ ట్రెజరీవాలా గతంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘ఎదురులేని మనిషి' చిత్రంలో నటించింది.
ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్
ఈ సమాజంలో మహిళలకు సరైన రక్షణ లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీకి, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అనిల్ అంబానీ తదితరులకు బహిరంగ లేఖ రాసింది.
నేను మీకు ప్రత్యేకంగా ఈ లేఖ రాయడానికి కారణం మీరంతా ఈ సమాజంలో మోస్ట్ పవర్ ఫుల్, ఇన్ఫ్లూయోన్స్ ఉన్న మగాళ్లు. ముంబైలో ఒక మధ్య తరగతి కుటుంబం నుండి ఎదిగిన మహిళగా లేఖ రాస్తున్నాను. ఈ సమాజంలో మహిళ రక్షణ కోసం మీ సహాయం అవసరం. అందుకే ఈ లేఖ రాస్తున్నాను అంటూన చిన్నతనంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించింది.
ఇపుడు ఈ లేఖలో నేను చెబుతున్న విషయాలు మా అమ్మా నాన్న పరువు మర్యాదలకు భంగం కలిగించొచ్చు. కానీ సగటు సాధారణ భారతీయ మహిళ ఈ సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటోందో తెలుపడానికే ఈ లేఖ రాస్తున్నాను. ఈ విషయాలు చెబుతున్నందుకు నేనేమీ సిగ్గుపడటం లేదు. మహిళల పట్ల లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న వారు సిగ్గు పడాలి అని వ్యాఖ్యానించారు.
13 ఏళ్ల వయసులో తల్లితో కలిసి కూరగాయల మార్కెట్ వెళ్లినపుడు కొందరు నన్ను చుట్టు ముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. కాలేజీ రోజుల్లో బస్సులో వెలుతున్నపుడు..కొందరు నన్ను చుట్టు ముట్టి అన్ని భాగాల్లో నన్ను టచ్ చేసి ఇబ్బంది పెట్టారు. నాలాగా ఇండియన్ ఉమెన్స్ అంతా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అందరికీ కారులో వెళ్లే స్తోమత ఉండదు కదా. నేను మెషిన్ గన్ పట్టుకుని నన్ను అలా చేసిన మగాళ్లందరినీ చంపేసినట్లు అప్పట్లో డ్రీమ్స్ వచ్చేవి.
నా పర్సనల్ లైప్ గురించి నేను మీకు చెప్పడానికి కారణం....ఈ సమాజంలో సగటు మహిళ ఎదుర్కొంటున్న పరిస్థితి తెలియ జేయడానికే. దేశంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్న దాన్ని అరికట్టడానికి మన వద్ద సరైన వ్యవస్థ లేదు. ఏ సమయంలోనైనా మహిళలు రోడ్డుపై ధైర్యంగా తిరిగే పరిస్థితి రావాలి అని లేఖలో పేర్కొంది.