Don't Miss!
- News నో ఎగ్జిట్ పోల్స్: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
- Sports IPL 2024: చేతగాని బౌలర్లు.. పెర్రీ, శ్రేయాంక పాటిల్ను తీసుకోండి! ఆర్సీబీపై పేలుతున్న సెటైర్స్!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
‘ధృవ’ 1 మిలియన్: యూఎస్ టూర్లో రామ్ చరణ్ ఏమన్నారంటే....
‘ధృవ’ 1 మిలియన్: యూఎస్ టూర్లో రామ్ చరణ్ ఏమన్నారంటే....
హైదరాబాద్: రామ్చరణ్కి 2016 చాలా గొప్ప ఏడాదిగా మిగిలింది. ఆయన కెరీర్లో అత్యంత భారీగా తెరకెక్కి విడుదలైన చిత్రాల్లో ధృవ ఒకటి. సినిమా విడుదలైనప్పటి నుంచే అటు విమర్శకుల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందుతోంది. మౌత్టాక్తో సినిమా యునానిమస్ హిట్గా నిలిచింది. ఓ వైపు జనాలు పెద్ద నోట్ల రద్దుతో బాధపడుతున్నప్పటికీ ధృవకు వారాంతంలో థియేటర్లు హౌస్ ఫుల్స్ కావడం విశేషం. సినిమా బావుంటే ఎన్ని ఇబ్బందులున్నా ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ధృవ పెద్ద నిదర్శనం.
అలాగే యుఎస్లోనూ వాతావరణం సానుకూలంగా లేనప్పటికీ చాలా చోట్ల థియేటర్లు హౌస్ ఫుల్ అటెండెన్స్ తో కనిపించాయి. అంటే ధృవకున్నక్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం మూడు రోజుల్లోనే ధృవ అక్కడ మిలియన్ డాలర్స్ మార్క్ ను క్రాస్ చేసింది. రామ్చరణ్ ప్రస్తుతం యుఎస్ఎలో టూర్లో ఉన్నారు. అందులో భాగంగానే ఆయన తన అభిమానులను, ప్రేక్షకులను కలుసుకుని మాట్లాడుతున్నారు.
రామ్చరణ్ మాట్లాడుతూ నా ధృవ టీమ్తో యుఎస్ఎలో పర్యటించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులను కలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికైనా అది సాకారమైనందుకు ఆనందంగా ఉంది. త్వరలో హైదరాబాద్కి చేరుకుంటాను. అక్కడ కూడా నా అభిమానుల సమక్షంలో సక్సెస్ను పంచుకుంటాను. ధృవ గురించి అందరూ పాజిటివ్గా మాట్లాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు అని అన్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ధృవ. రామ్చరణ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్, ఎన్వీప్రసాద్ నిర్మించారు. సురేందర్రెడ్డి దర్శకత్వం వహించారు.