Don't Miss!
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ - త్రివిక్రమ్- పవన్ స్కిట్ గురించి సురేష్ బాబు
హైదరాబాద్: ఈ నెల 30 జరిగే ‘మేము సైతం' కార్యక్రమం గురించి తెలుగు సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హుధూద్ తుఫాన్ బాధితుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల కార్యక్రమాలు ఎన్ని ఉన్నా.....అందరూ ఓ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అది మరేదో కాదు.....మహేష్ బాబు, త్రివిక్రమ్, పవన్ కళ్యాన్ కలిసి చేసే స్కిట్ కోసం. అసలు వీరిలో ఏ ఒక్కరు స్కిట్ చేసినా అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. అలాంటిది ముగ్గురు కలిసి స్కిట్ చేస్తే టాప్ లేచి పోవాల్సిందే. సోమవారం జరిగిన మేము సైతం ప్రెస్ మీట్లో నిర్మాత సురేష్ బాబు ఈ స్కిట్ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.
పవన్, త్రివిక్రమ్, మహేష్ బాబు కలిసి ఓ స్కిట్ చేస్తారు. అదే విధంగా ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి కలిసి మరో స్కిట్ చేస్తున్నారు. మంచు విష్ణు, మనోజ్ రెండు టీములుగా విడిపోయి కబడ్డీ ఆడుతున్నారు అని సురేష్ బాబు తెలిపారు.