Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సుశాంత్ తాజా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ (వీడియో)
హైదరాబాద్ : 'సిసింద్రీ' సినిమాలో ఆటాడుకుందాం రా... అందగాడా అంటూ సాగే ఓ పాట ఉంది. ఇప్పుడు ఆ పల్లవినే తన సినిమాకి పేరుగా మార్చుకొని వచ్చాడు సుశాంత్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం చేస్తున్నాడు సుశాంత్. దానికి 'ఆటాడుకుందాం రా...' అనే పేరును ఖరారు చేసి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని వదిలారు.
చింతలపూడి శ్రీనివాస్, నాగ సుశీల నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. ఆ వీడియోని ఫేస్ బుక్ ద్వారా సుశాంత్ షేర్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ ని అఖిల్ లాంచ్ చేసారు.
The wait is over and here's the first look of my upcoming movie #AatadukundamRaa!Do watch,share your views :)http://bit.ly/AatadukundamRaaFirstLook
Posted by Sushanth on 5 November 2015
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
'అడ్డా'తో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న సుశాంత్ ఈ కొత్త చిత్రంతో హిట్ కొడతాననే ధీమాతో ఉన్నారు. 'దేనికైనారెడీ' వంటి చిత్రాన్ని రూపొందించిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోండటంతో మంచి క్రేజ్ వస్తోంది.
సుశాంత్ మాట్లాడుతూ '' నాగేశ్వరరెడ్డి చెప్పిన కథ బాగుంది. నా కెరీర్కి లాభం చేకూర్చే చిత్రమిది ''అన్నారు. జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ''ఇది యువత నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రం. సుశాంత్ నటనలోని అన్ని కోణాల్ని చూపించేలా ఉంటుంది''అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ''ఈ మధ్య కాలంలో అక్కినేని కథానాయకుల చిత్రాలన్నీ విజయబావుటా ఎగరేస్తున్నాయి. ఆ జాబితాలో ఈ చిత్రమూ చేరుతుంది. 'అడ్డా తరవాత మంచి కథ కోసమే ఇంతకాలం ఎదురుచూశాం. ఇప్పుడు అలాంటి కథను శ్రీధర్ సీపాన అందించారు. ''అన్నారు. బ్రహ్మానందం, నాగినీడు, రఘుబాబు, తనికెళ్ల భరణి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు.