Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్వేతాబసు ఐటం సాంగ్ హైలెట్ అంటున్నారు
చిత్రం గురించి ఓంకార్ మాట్లాడుతూ "ప్రతి విద్యార్థికి ఈ చిత్రం ఓ స్ఫూర్తి అవుతుంది. సిల్వర్ స్పూన్తో పెరిగిన హవీశ్ ఈ సినిమా కోసం చాలా శ్రమించాడు. జోష్వా శ్రీధర్ మ్యూజిక్ సూపర్గా ఇచ్చారు'' అన్నారు. ఈ చిత్ర కథారచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ "అన్నా హజారే స్ఫూర్తితో, ఆయన పుట్టిన ఊరికి వెళ్లి ఈ కథ రాశాను. విద్యార్థుల భవితను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఈ 'జీనియస్'. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు యావత్ భారతదేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఓ వర్గం కలెక్షన్ల కోసం, మరో వర్గం రికార్డుల కోసం పోటీ పడుతున్నారు. వారిలో కొంచెం అయినా మార్పు రావాలని రాసిన కథ ఇది'' అని తెలిపారు.
నిర్మాత కిరణ్ మాట్లాడుతూ "హవీశ్ గొప్పగా నటించాడు. ఈ సినిమా కోసం ఓంకార్ చాలా కష్టపడ్డాడు. డబ్బుల కోసం ఈ సినిమా తియ్యలేదు. ఓ మంచి సందేశం ఉన్న కథ అని తీశాను. దీపావళి తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు. "పోస్టర్లలో కన్నీళ్లు ఉంటే క్లాస్ హీరో, కళ్లల్లో నిప్పులుంటే మాస్ హీరో. హవీశ్లో ఈ రెండూ ఉన్నాయి. వ్యక్తి పూజ వద్దని చెప్పే కథ'' అని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. హీరో హవీశ్ మాట్లాడుతూ "ఇది చిన్నికృష్ణగారి డ్రీమ్ ప్రాజెక్ట్. శంకర్ రేంజ్లో ఓంకార్ ఈ సినిమా తీశారు. ఈ రోజు సమాజానికి కావాల్సిన సినిమా'' అన్నారు.
ఇక శ్వేతబాసు తాజాగా తారకరత్న హీరోగా వి. దొరస్వామిరాజు నిర్మిస్తున్న చిత్రం 'విజేత లో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో వరుడు చిత్రంతో పరిచయమైన భానుశ్రీ మెహ్రా కూడా నటిస్తోంది. ఉదయ్భాస్కర్ దర్శకుడు. ఈ విషయమై నిర్మాత దొరస్వామి రాజు మాట్లాడుతూ...''నాగార్జున నటించిన 'కిరాయిదాదా'తో నిర్మాతగా నా ప్రస్థానం మొదలైంది. ఎందరో హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాను. నందమూరి తారకరత్నతో ఇప్పుడు తీస్తున్న 'విజేత' నిజంగా అతన్ని విజేతగా నిలుపుతుంది'' అన్నారు.