Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎవరు అదుర్స్?: అతిలోక సుందరితో 'అవంతిక' కి పోలిక
హైదరాబాద్: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా తారాగణంతో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రంలో ఓ ప్రధానపాత్ర పోషిస్తున్న తమన్నా జన్మదినం సందర్భంగా యూనిట్ ఆమె ఫస్ట్లుక్ విడుదల చేసింది. తమన్నా పాత్ర పేరు 'అవంతిక'. యువరాణి పాత్రలో దేవకన్యను తలపిస్తున్న తమన్నా స్టిల్ చిత్రంపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది. అయితే ఈ ఫస్ట్ లుక్ ...జగదేక వీరుడు...అతి లోక సుందరి చిత్రంలో శ్రీదేవిని గుర్తుకు తెచ్చేలా డిజైన్ చేసారని అంతటా వినిపిస్తోంది. అందులో శ్రేదేవి..ఇంద్రుని కుమార్తె ఇంద్రజ గా కనిపించి మురిపించిన సంగతి తెలిసిందే.
https://www.facebook.com/TeluguFilmibeat
ఈ చిత్రంలో ప్రభాస్ ...తండ్రి,కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ..తండ్రి కథను నేరేట్ చేస్తూ సాగుతుంది. తండ్రి పాత్రకు భార్యగా...అనుష్క నటిస్తూండగా...సెకండ్ పార్ట్ లో వచ్చే కొడుకు పాత్రకు గానూ తమన్నా కనిపించనుంది. రానా నెగిటివ్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రమ్యకృష్ణ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ... ‘‘తమన్నా పాత్ర ఈ సినిమాలో చాలా కీలకమైంది. ఆమె ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్లో ఉంది. ప్రభాస్, తమన్నాపై అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. బల్గేరియా నుంచి రాగానే రాజమౌళి వాటిని పర్యవేక్షిస్తారు. డాల్బీ అట్మాస్ ఫార్మేట్లో పి.ఎం.సతీష్ సౌండ్ మిక్సింగ్ చేస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. 2015 వేసవి కానుకగా బహు భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు.
రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘బాహుబలి' ఫస్ట్ పార్ట్ 2015 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానంది. ఈ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను త్వరగా కంప్లీట్ చేయనున్నారు. సంగీత దర్శకులు యం.యం.కీరవాణి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి' పార్ట్ 1ను ఏప్రిల్ 17, 2015న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పలు భాషలలో డబ్బింగ్ చేయనున్నారు.