Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నేపాల్ భూకంపం: తెలుగు సినిమా యూనిట్ సభ్యులు ఏమైనట్లు?
హైదరాబాద్: పొరుగుదేశం నేపాల్ను ఈ రోజు ఉదయం భారీ భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.9 గా నమోదైంది. ఈ భూకంపం దాటికి అక్క భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. నేపాల్ లోని పలు పలు చారిత్మక కట్టడాలు భూకంపం ధాటికి కూలిపోయాయి.
నేపాల్ లో చాలా మంది తెలుగు వారు చిక్కుకు పోయారు. అక్కడ ఫోన్ నెట్వర్క్ పని చేయక పోవడంతో ఆచూకి తెలియడం లేదు. నేపాల్ లో చిక్కుకున్న వారిలో 'వెటకారం.కామ్' అనే తెలుగు చిత్రాకికి సంబంధించిన 20 మంది బృందం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఫోన్లు పని చేయక పోతుండటంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.
‘వెంటకారం.కామ్' చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్న కుమారుడైన వీరేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగులో భాగంగా చిత్ర యూనిట్ నేపాల్ వెళ్లారు. అయితే ఎవరి ఫోన్లూ పని చేయడం లేదని, అక్కడ ఏమైందో తెలియక ఆందోళన చెందుతున్నామని, హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసినా సరైన సమచారం దొరకడం లేదని బంధువులు ఆందోళన చెందుతున్నారు. భూకంపం వచ్చిన సమయంలో వారు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయం కూడా తెలియడం లేదు.