Don't Miss!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ లాయర్లు రేపిస్టులే: హీరోయిన్ అమలా పాల్ ఫైర్
హైదరాబాద్: మళయాలం హాట్ బ్యూటీ అమలా పాల్ ఆగ్రహంతో ఊగి పోయింది. వివాదాస్పద ‘ఇండియాస్ డాటర్' డాక్యుంటరీలో డిఫెన్స్ లాయర్స్ ఎకె సింగ్, ఎంఎల్ శర్మ చేసిన కామెంట్లపై ఆమె మండి పడింది. ఈ ఇద్దరు లాయర్లు నిర్భయను దారుణంగా రేప్ చేసి హత్య చేసిన నిందితుల తరుపున వాదిస్తున్నారు.
నిర్భయ ఘనటపై బీబీసీ జర్నలిస్టు లెస్లీ ఉడ్విన్ తెరకెక్కించిన డాక్యుమెంటరీలో.... నిర్భయ నిందితులు, వారి లాయర్లు, వారి కుటుంబ సభ్యులు, బాధితురాలి తల్లిదండ్రుల అభిప్రాయాలు పొందు పరిచారు. నిందితుల తరుపున వాదిస్తున్న లాయర్లు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
నిందితులను వెనకేసుకొస్తూ...నిర్భయ ఆ సమయంలో బయటకు వెళ్లడాన్ని తప్పుగా వాదిస్తున్నారు. లాయర్ ఎమ్ఎల్ శర్మ మాట్లాడుతూ, బజారులో మిఠాయిలు పెడితే కుక్కలు ఎలా ఎగబడతాయో, సరైన రక్షణ లేకుండా బయట కనబడే అమ్మాయిలపై అత్యాచారాలు కూడా సహజమంటూ నిందితులను వెనకేసుకొచ్చారు. మరో లాయర్ మాట్లాడుతూ...మా కుటుంబంలో నాకూతురో, సోదరో రాత్రి పూట అలా తిరిగితే జుట్టు కత్తిరిస్తానంటూ వ్యాఖ్యానించారు.
లాయర్ల తీరుపై అమలా పాల్ మండి పడింది. వీరు కూడా రేపిస్టుల్లానే కనబడుతున్నారంటూ మండిపడింది. మరో వైపు డిఫెన్స్ లాయర్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. మహిళకు రక్షణ లేకపోతే.. ఆమెపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారా.. అంటూ మండిపడుతున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దారుణంగా, నీచాతినీచంగా ఓ ఆడబిడ్డను పాడుచేసి పొట్టనబెట్టుకుని.. అదే ఆడబిడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అంటూ మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.