Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అప్పుడు పవన్ పై , ఇప్పుడు అమీర్ ఖాన్ పై దారుణ వ్యాఖ్యలు
ముంబై: బాలీవుడ్ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బాలీవుడ్ నటుడు, నిర్మాత కమాల్ రషీద్ ఖాన్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయన ఈ సారి అమీర్ ఖాన్ ని, సన్నిలియోన్ ని టార్గెట్ చేసారు. వరస పెట్టి చేసిన ట్వీట్స్ లో ఆయన అమీర్ ఖాన్ ని బేషరమ్ ని పిలిచారు. అంతేకాకుండా సన్నిలియోన్ ని ప్రమోట్ చేస్తున్నారని, ఆమెని పెళ్లి చేసుకోవటం కోసం తన భార్య కిరణ్ రావుని సైతం వదిలివేస్తారని అన్నారు.
అయితే హఠాత్తుగా ఇలా కేఆర్కే రెచ్చి పోవటానికి కారణం...అమీర్ ఖాన్ ఇచ్చిన దీపావళి పార్టీకి సన్నిలియోన్ హాజరవ్వటమే. ఈ విషయమై అమీర్ ఖాన్ అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యాడు.
కొద్ది రోజుల క్రితం ..దీపావళికి విడుదల అయిన అజయ్ దేవగన్ కొత్త సినిమా శివాయ్ కు నెగిటివ్ గా ప్రచారం చేయడానికి కేఆర్కేకు కరణ్ జోహార్ రూ.25లక్షలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి విషయం తెలిసిందే.
అలాగే గతంలోనూ కమాల్ రషీద్ ఖాన్ మన తెలుగు హీరో పవర్ స్టార్ని టార్గెట్ చేసాడు. పవన్ కళ్యాణ్ లాంటి వాడే హీరో అయితే ప్రపంచంలో ఎవరైనా సూపర్ స్టార్ కావచ్చు. అసలు దక్షిణాది ప్రేక్షకలుకు ఏమైంది, ఇలాంటి కార్టూన్ని వాళ్లు హీరోగా ఎలా అంగీకరిస్తున్నారు ? వాళ్ల ఛాయిసే తప్పు.
పవన్ కళ్యాణ్ లాంటి జోకర్ హీరో సినిమాలు చూడడం కన్నా , రాజ్పాల్ యాదవ్ టాంటి వారి సినిమాలు చూడటానికి నేను చాలా ఇష్టపడతాను అంటూ కమాల్ ట్వీట్ చేసాడు. అయితే ఈ ట్వీట్లో ఒకచోట పవన్ కళ్యాణ్ పేరును పవన్ కళ్యాణ్ సింగ్ అని ప్రస్తావించారు.