twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుద్దిలేని గాడిదలు అంటూ వేణు మాధవ్ ఫైర్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తాను చనిపోయినట్లు ప్రచారం చేస్తుండటంపై తీవ్ర మనస్తాపానికి గురైన ప్రముఖ తెలుగు కమెడియన్ వేణు మాధవ్ ఇటీవల ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనపై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని వేణు మాధవ్ సీరియస్ గానే తీసుకున్నారు.

    ఈ విషయమై ఆయన ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రులునాయిని, తలసానిలను కలిసారు. త్వరలో గవర్నర్ ను కూడా కలుస్తానని, తనపై జరుగుతున్న అసత్యం ప్రచారంపై ఫిర్యాదు చేస్తానని వేణు మాధవ్ వెల్లడించారు.

    Tollywood comedian Venu Madhav fire on false news

    ఆదివారం హన్మకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఫైర్ అయ్యారు. కొందరు బుద్దిలేని గాడిదలు పనిలేక తనపై ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని వేణు మాధవ్ స్పష్టం చేసారు.

    తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరానని వేణు మాధవ్ తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారం వల్ల తనతో పాటు తన అభిమానులు కూడా మనస్తాపానికి గురయ్యారని వేణు మాధవ్ ఆవేదన వెలుబుచ్చారు.

    English summary
    Popular comedian Venu Madhav has not been seen in a Telugu film for a few years and speculations were rife on social media about his whereabouts, with some even saying that he had died. He requested to GOVT to take stringent action against people who were spreading rumours about him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X