Don't Miss!
- News బీజేపీ 7వ జాబితా: అమరావతి నుంచి నవనీత్ కౌర్ రాణా పోటీ
- Sports Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
దర్శక,నిర్మాత,నటుడు డి.రంగారావు మృతి
హైదరాబాద్ : హిట్, ఫ్లాపులకు సంభంధం లేకుండా వరసగా సినిమాలు నిర్మిస్తూ...కేవలం తొమ్మిదేళ్ల కాలంలో 55 చిత్రాలను స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన దోసపాటి రంగారావు (57) గుండెపోటుతో హైదరాబాద్లో మరణించారు. ఆయన సినిమాలు దర్శకత్వం వహించి, నిర్మించటమే కాకుండా నటిస్తూండేవారు కూడా.
డి. రంగారావుగా తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితమైన ఆయన డైరెక్ట్ చేసిన చిత్రాల్లో కృష్ణతో చేసిన ‘సీబీఐ ఆఫీసర్' కూడా ఉంది. అలాగే ఆయన తెలుగులోనే కాకుండా ‘ప్రేమి' అనే హిందీ సినిమాని కూడా రూపొందించారు.
వరంగల్లో జన్మించిన రంగారావు సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చి అయ్యప్ప ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పి, 2000లో మొట్టమొదటగా సొంత డైరెక్షన్లో తక్కువ బడ్జెట్తో, అతి తక్కువ సమయంలో ‘ఐ డోంట్ కేర్' అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత తనే నిర్మాత, దర్శకునిగా ‘భయం', ‘అంతా ఒక మాయ', ‘బెండుతీస్తా', ‘మిస్టరీ', ‘ప్రియాంక' తదితర యాభై చిత్రాలు తీశారు. ఆయన చివరి చిత్రం 2009లో వచ్చిన ‘ప్రేమి.. నాటీ బాయ్'.