Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రేక్షకులపైనే మూత్ర విసర్జన చేసే హీరో...(ట్రైలర్ షాకింగ్)
హైదరాబాద్: షాహిద్ కపూర్, అలియా భట్, కరీనాకపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం 'ఉడ్తా పంజాబ్'. అభిషేక్ చౌబే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి సంబందించి అఫీషియల్ ట్రైలర్ ఇటీవల విడుదల చేసారు. పంజాబ్లో తీవ్రమైన డ్రగ్స్ సమస్యను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 70 శాతం మంది పంజాబ్ యువత డ్రగ్స్ కు బానిసయ్యారు. ఇది ఇలానే కొనసాగితే పంజాబ్ మరో మెక్సికో అవుతుంది అనే కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
పంజాబ్లో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా, అక్రమ రవాణా లాంటి అంశాలను ఈ సినిమాలో ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఫాంటమ్ ఫిలింస్, బాలాజీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న రాక్ స్టార్ గా సాహిద్ కపూర్, బిహారీ శరణార్దురాలి పాత్రలో అలియా భట్, డాక్టర్ పాత్రలో కరీనా కపూర్, పోలీస్ అధికారి పాత్రలో దల్జిత్ దోసంజా కనిపించారు.
ఈ చిత్రంలో షాహిద్ కపూర్ టామీ సింగ్ అనే రాక్ స్టార్ పాత్రలో నటిస్తున్నాడు. డ్రగ్స్ కు బానిసైన టామీ సింగ్... ఓ షోలో ప్రేక్షకులపైనే మూత్ర విసర్జన చేసే సీన్ ట్రైలర్లో చూపెట్టారు. పంజాబ్ యువతలో డ్రగ్స్ ప్రభావం ఎలా ఉందో అద్దం పెట్టేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి బాలీవుడ్ ప్రముఖుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రంలో నటించిన నటీనటులంతా కెరీర్లో ఓ మెట్టు పైకి ఎక్కినట్లేనని హృతిక్ రోషన్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు. ఈ చిత్రంలో జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.