Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
‘మిర్చి’ రీమేక్: సుదీప్తో ఆ హీరో కూతురు
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రాన్ని కన్నడలో సుదీప్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వారం క్రితమే ప్రారంభం అయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సుదీప్ సరసన హీరోయిన్గా తమిళ స్టార్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ఎంపికైంది.
'పోడా పోడి' అనే తమిళ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన వరలక్ష్మి ఇప్పుడు కన్న ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధం అవుతోంది. ఇప్పటికే వరలక్ష్మి సెక్సీ ఫోటో షూట్లతో కుర్రకారు మతి పోగొడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కన్నడ సినీరంగానికి పరిచయం అవుతుండటం చర్చనీయాంశం అయింది.
గతంలో 'కెంపె గౌడ' అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సుదీప్, దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. మిర్చి రీమేక్లో నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఈ చిత్ర నిర్మాత ఎన్.ఎం.కుమార్ మీడియాతో మాట్లాడుతూ వరలక్ష్మిని హీరోయిన్గా ఎంపిక చేసిన విషయాన్ని వెల్లడించారు.
'సినిమాలోని ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా వరలక్ష్మిని ఎంపిక చేసాం. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది' అని ఎన్.ఎం.కుమార్ తెలిపారు. తెలుగులో విడుదలైన 'మిర్చి' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లు. తెలుగులో ఈచిత్రం భారీ విజయం సాధించింది.