Don't Miss!
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఈనెల్లోనే నెక్ట్స్ మూవీ: వరుణ్ తేజ్ ప్రకటన
హైదరాబాద్: ‘ముకుంద' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఖరారైంది. ఇందుకు సంబంధించిన విషయాలను వరుణ్ తేజ్ తన మైక్రోబ్లాగింగ్ ద్వార ప్రకటించారు. క్రిష్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి నిర్మించబోతున్నారు. ఫిబ్రవరి 27న ఈ చిత్రం ప్రారంభం కానుంది.
Hey
tweeps..Starting
my
next
movie
on
the
27th
this
month..Krissh
is
handling
the
direction
and
Rajiv
reddy
is
producing...Excited!!!
—
Varun
Tej
Konidela
(@IAmVarunTej)
February
25,
2015
ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ ‘హే ట్వీప్స్...నా తర్వాతి సినిమా ఈ నెల 27న ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని క్రిష్ హ్యాండిల్ చేస్తున్నారు. రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. చాలా ఎగ్జైటెడ్గా ఉంది' అని వరుణ్ తేజ్ ప్రకటించారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్నారు. అయితే ముందుగా క్రిష్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అవుతుంది.