Don't Miss!
- News ఏపీలో కేసుల్లో ఈయనే టాప్; సెంచరీకి చేరువగా టీడీపీ అభ్యర్థిపై కేసులు!!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రొమాన్స్ మూడ్ లో : వరుణ్ తేజ, రెజీనా కలిసి...(ఫొటో)
హైదరాబాద్ : నాగ బాబు కుమారుడు వరుణ్ తేజ, రెజీనా కలిసి ఇదిగో ఇలా ఇన్ ద మూడ్ ఆప్ లవ్ అంటూ లీనమై ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకుంటున్నారు. ఇంతకీ ఈ ఫొటో సౌత్ స్కోప్ పత్రిక కోసం తీసిన స్టిల్ ఇది. వీరిద్దమరి మధ్యా అద్బుతమైన కెమిస్ట్రీ కుదరిందని చెప్తున్నారు. వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో పని చేయనున్నారా ...అవుననే వినపడుతోంది. ఈ లోగా ఈ ఫొటోని చూడండి.
తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'ముకుంద' చిత్రాన్ని చేసిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ త్వరలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు. ఇది ఈ ఏడాది ప్రారంభమవుతుంది.
అలాగే, కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు కల్యాణ్ తెలిపారు. నితిన్ తో ఒక సినిమా, నాగచైతన్య తో ఒక సినిమా ప్లానింగులో వున్నాయని చెప్పారు. 'కేడీ' సినిమా తర్వాత నాగార్జునతో ఓ సినిమా నిర్మించాల్సివుందనీ, సరైన కథ దొరకక ఇంకా సెట్స్ కి వెళ్ళలేదనీ అన్నారు.
ఇటీవలే నాగార్జున కోసం... నలుగురు అమ్మాయిల మధ్య హీరో అనే కాన్సెప్టుతో ఓ కథ విన్నానని ఆయన తెలిపారు. ఇది నాగార్జునకు బాగా సూటవుతుందని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా తమకు వచ్చే ఏడాది ఓ సినిమా వుందని నిర్మాత కల్యాణ్ తెలియజేశారు.