Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
రూమర్స్ కు చెక్ పెట్టడానికే వరుణ్ తేజ ట్విట్టర్ లోకి వచ్చి మరీ...
హైదరాబాద్: గతి కొద్ది రోజులుగా...మీడియాలో శ్రీను వైట్ల, వరుణ్ తేజ కాంబినేషన్ లో మొదలైన సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.మిస్టర్ పేరుతో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరున పూజా కార్యక్రమాలతో మొదలైంది. అయితే నేటి వరకూ సెట్స్ మీదికి వెళ్ళకపోవడంతో ఈ సినిమాపై రూమర్స్ మొదలయ్యాయి.
దానికి తోడు శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ సినిమా ప్రారంభం కాబోతోందంటూ వార్తలు రావటంతో గాలికి ఆజ్యం పోసినట్లైంది. అప్పటికీ మధ్యలో రచయిత గోపీ మోహన్ కలగజేసుకుని ఒకటి రెండు సార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. కానీ ఈ విషయమై దర్శక,నిర్మాతలు కానీ హీరో కానీ మాట్లాడకపోవటంతో ఆయన మాటలకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇదంతా హీరో వరుణ్ తేజ్ గమనించినట్లున్నారు. ట్విట్టర్ లోకి వచ్చి ఈ సినిమా విషయమై పూర్తి క్లారిటీ ఇచ్చాడు .
Can't wait to get back to work and back on sets.My film with Srinu Vaitla garu will start rolling in Spain from 27th pic.twitter.com/c06HVYAQ5j
— Varun Tej (@IAmVarunTej) June 9, 2016
వరుణ్ తేజ చెప్పినదాని ప్రకారం...ఈ నెల 27 నుండి స్పెయిన్లో తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది. గోపీమోహన్ కథ అందిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా కనపడనుంది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జే మేయర్, మాటలు : శ్రీధర్ సీపాన, కెమెరా: జె.యువరాజ్.