Don't Miss!
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కమెడియన్ వేణు మాధవ్ మరీ ఇంతగానా...
హైదరాబాద్: 'నీకు బాగా బలుపు, నోటి దురుసు ఎక్కువ' అంటే ఎవరికైనా కోపం వస్తుంది. అయితే టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్ మాత్రం అస్సలు ఫీలవ్వరు. పైగా ఆయన్ను ఎవరైనా ఇలా అంటే హ్యాపీగా ఫీలవుతారు కూడా. ఇది మేమేదో కామెడీకి అనడం లేదు.... ఈ విషయాన్ని వేణు మాధవ్ స్వయంగా వెల్లడించారు. ఓ పత్రిక ఇంటర్వ్యూలో వేణు మాధవ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
తాను చనిపోయినట్లు ఇటీవల జరిగిన ప్రచారం చాలా బాధించిందని వేణు మాధవ్ తెలిపారు. "ఆ ప్రచారం జరిగినపుడు నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి సరిపోయింది. నేను ఎక్కడైనా బయట ఉంటే, ఆ సమయంలో నా ఫోన్ కలవకపోతే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంత ఆందోళన చెందుతారో ఒక్కసారి ఆలోచించండి. కొందరైతే నాకు ఫోన్ చేసి మూడో రోజు, పదకొండో రోజు కర్మ ఎప్పుడు అంటూ అడిగారు. ఇలాంటి వార్తలు విన్నపుడు నా భార్య, మా అమ్మ ఒకటే ఏడుపు. ఇలాంటి విని నేను భరించ గలను. కానీ నా కుటుంబ సభ్యులు బాధ పడుతుంటే భరించలేను" అంటూ తన మనసులోని మాట బయట పెట్టారు వేణు మాధవ్.
ఏమిటీ... ఈ మధ్య సినిమాలు చేయడం లేదు? అవకాశాలు రావడం లేదా? మీరు ఇంట్లోనే ఉంటే అవకాశాలు ఎవరిస్తారు? వెళ్లి ప్రయత్నం చేయవచ్చు కదా? అనే ప్రశ్నకు వేణు మాధవ్ తనదైన రీతిలో స్పందించారు. "ఛీ..ఛీ.... వేణు మాధవ్ అలాంటి వాడు కాదు. ఒకరి దగ్గరకు వెళ్లి సినిమా అవకాశాలు అడుక్కునే అవసరం నాకు లేదు. నా జీవితంలో ఎప్పుడూ అవకాశాల కోసం ప్రయత్నించ లేదు. అవకాశాలే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి" అన్నారు.
"ఈ మధ్య కావాలనే సినిమాలు చేయడం లేదు. అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్న పాత్రలే వస్తున్నాయి. నేను నాకుటుంబం, బంధువులతో కలిసి చూడదగ్గ మంచి పాత్రలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాలో, బాలయ్య 100వ సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేస్తున్నాను. ఈ సినిమాలో మంచి పాత్రలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి" అని వేణు మాధవ్ తెలిపారు.
మీ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరిని హీరోను చేస్తారు అని అడగ్గా.... "నా పిల్లలను సినిమా పరిశ్రమకు దూరంగా ఉంచుతున్నాను. నాకు ఇంట్రస్టు లేదు. వారిని బాగా చదివిస్తా. వారు ఎంత చదువుతానన్నా చదివించే స్థోమత నాకు ఉంది. ఇన్నాళ్లు సినిమాలు చేయడం ద్వారా కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేంతగా సంపాదించాను. ఇంటర్మీడియట్ వరకు నేను వారిని గైడ్ చేస్తాను. ఆ తర్వాత వారు చదువు పరంగా వారు ఏ రంగంలోకి వెళతానన్నా వారి ఇష్టానికే వదిలేస్తాను. ఒక వేళ వాళ్లు సినిమా రంగంలోకే వస్తానంటే.. అది వాళ్ల ఇష్టం. కాదనను" అన్నారు వేణు మాధవ్.