Don't Miss!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చనిపోయినట్లు ప్రచారం: పోలీసులను ఆశ్రయించిన వేణు మాధవ్
హైదరాబాద్: ప్రముఖ తెలుగు కమెడియన్ వేణు మాధవ్ మంగళవారం తాను చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ తో పాటు కొన్ని వెబ్ సైట్లలో తాను చనిపోయినట్లు ప్రచారం చేస్తుండటంతో షాకైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు.
తనపై ఎవరో కుట్రపూరితంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని.... నిజా నిజాలు నిర్దారించుకోకుండా ఈ విషయాన్ని కొన్ని ఛానల్స్ గుడ్డిగా ప్రచారం చేయడంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు.
తాను చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారం చూసి తీవ్రమైన మనో వేదనకు గురయ్యానని, ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేణు మాధవ్ పోలీసులను కోరారు.
సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత..... ఇలాంటి విషయాలు చాలా స్పీడుగా స్ప్రెడ్ అవుతున్నాయి. కొందరు కావాలని ఇలాంటి తప్పుడు పోస్టులు చేయడం, నిజా నిజాలు నిర్దారించుకోకుండా అందరూ దాని షేర్ చేస్తుండటం లాంటివి చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం తమిళ కమెడియన్ సెంథిల్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. తాను చనిపోయినట్లు మీడియాలో ప్రచారం జరుగడంతో షాకైన ఆయన మీడియా ముందుకు వచ్చి తాను బ్రతికే ఉన్నానని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇపుడు అలాంటి పరిస్థితే వేణు మాధవ్ కు ఎదురైంది.