Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
2 కోట్లకు డీల్ సెట్టయింది: బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్
హైదరాబాద్: విజయేంద్ర ప్రసాద్... తెలుగు ప్రముఖ రచయితల్లో ఒకరు. అంతకు ముందు ఆయన చాలా సినిమాలు చేసినా దేశ వ్యాప్తంగా బాగా పాపులారిటీ వచ్చింది మాత్రం బాహుబలి, బజరంగీ భాయిజాన్ చిత్రాల తర్వాతే. 2015లో ఒకదాని తర్వాత ఒకటి విడుదలైన ఈ చిత్రాలు రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసాయి.
విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన'బాహుబలి' చిత్రం దేశ వ్యాప్తంగా ఓ సంచలనం. సౌత్ నుండి వచ్చిన ఒక చిత్రం ఉత్తరాధిన భారీ విజయం సాధించడం అదే తొలిసారి. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన 'బజరంగీ భాయి జాన్' చిత్రం కూడా బాలీవుడ్లో భారీ విజయం సాధించింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ 'బజరంగీ భాయిజాన్' చిత్రానికి సంబంధించిన విశేషాలు చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి కథ అందించినందుకు గాను తనకు తొలుత రూ. 40 లక్షలు ఆఫర్ చేసారని, తాను రూ. 2.5 కోట్లకంటే ఒక పైసా తక్కువకు కూడా స్టోరీ ఇవ్వనని చెప్పాను. చివరకు రూ. 2 కోట్లు డీల్ సెట్టయిందని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ 'బాహుబలి' సీక్వెల్స్ కు సంబంధించిన కథలు రాయడంలో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ బాహుబలి-2కు స్ర్కిప్టు రాయడం పూర్తయింది...షూటింగు కూడా మొదలైంది. దీని తర్వాత బాహుబలి-3 కూడారాబోతోందని విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు.