twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2 కోట్లకు డీల్ సెట్టయింది: బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: విజయేంద్ర ప్రసాద్... తెలుగు ప్రముఖ రచయితల్లో ఒకరు. అంతకు ముందు ఆయన చాలా సినిమాలు చేసినా దేశ వ్యాప్తంగా బాగా పాపులారిటీ వచ్చింది మాత్రం బాహుబలి, బజరంగీ భాయిజాన్ చిత్రాల తర్వాతే. 2015లో ఒకదాని తర్వాత ఒకటి విడుదలైన ఈ చిత్రాలు రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసాయి.

    విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన'బాహుబలి' చిత్రం దేశ వ్యాప్తంగా ఓ సంచలనం. సౌత్ నుండి వచ్చిన ఒక చిత్రం ఉత్తరాధిన భారీ విజయం సాధించడం అదే తొలిసారి. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన 'బజరంగీ భాయి జాన్' చిత్రం కూడా బాలీవుడ్లో భారీ విజయం సాధించింది.

     Vijayendra Prasad about Bajrangi Bhaijaan deal

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ 'బజరంగీ భాయిజాన్' చిత్రానికి సంబంధించిన విశేషాలు చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి కథ అందించినందుకు గాను తనకు తొలుత రూ. 40 లక్షలు ఆఫర్ చేసారని, తాను రూ. 2.5 కోట్లకంటే ఒక పైసా తక్కువకు కూడా స్టోరీ ఇవ్వనని చెప్పాను. చివరకు రూ. 2 కోట్లు డీల్ సెట్టయిందని ఆయన చెప్పుకొచ్చారు.

    ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ 'బాహుబలి' సీక్వెల్స్ కు సంబంధించిన కథలు రాయడంలో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ బాహుబలి-2కు స్ర్కిప్టు రాయడం పూర్తయింది...షూటింగు కూడా మొదలైంది. దీని తర్వాత బాహుబలి-3 కూడారాబోతోందని విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు.

    English summary
    The star writer Vijayendra Prasad was first offered 40 lakhs for Bajrangi Bhaijaan story, but he refused to give it away for any penny less than 2.5 crores. The deal was cut at 2 crores finally.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X