Don't Miss!
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
కాపీ వివాదం: చిక్కుల్లో బాహుబలి రచయిత
హైదరాబాద్: బాహుబలి, భజరంగీ భాయిజాన్ చిత్రాలకు కథలు అందించిన రచయిత విజయేంద్రప్రసాద్... ఈ రెండు సినిమాలు భారీ విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అయితే ఆయన ‘బజరంగీ భాయి జాన్' కథ తనదే అంటూ మరో రచయిత ఇటీవల కేసు వేసారు.
రచయత, టీవీ నిర్మాత అయిన మాహిమ్ జోషి ‘బజరంగీ భాయిజాన్' కథ తదనే అంటూ కాపీ రైట్ యాక్ట్ కింద 50 కోట్లకు సూట్ వేసారు. చాలా ఏళ్ల క్రితమే మాహిమ్ ఈ స్టోరీ రిజిస్టర్ చేయించారని, అయితే ‘బజరంగీ భాయిజాన్' సినిమా స్టోరీ తను రాసుకున్న స్టోరీ మాదిరిగానే ఉండటంతో కంప్లైంట్ చేసారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.
కోర్టు మాహిమ్ స్కిప్టుతో పాటు ‘బజరంగీ భాయి జాన్' సినిమాను పరిశీలించినట్లు తలుస్తోంది. రెండు స్టోరీల్లోనూ కొన్ని అంశాల్లో సారూప్యత ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అక్టోబర్ 21లోగా వివరణ ఇవ్వాలని నిర్మాతలు రాక్ లైన్ వెంకటేష్, సల్మాన్ ఖాన్, డైరెక్టర్ కబీర్ ఖాన్, రచయిత విజయేంద్రప్రసాద్ లకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.