Don't Miss!
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గ్యాంగ్ రేప్ : హీరోయిన్ సీరియస్, బూతు కామెంట్స్
హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘రౌడీ ఫెలో' చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన విశాఖ సింగ్..... తాజాగా ఢిల్లీలో జరిగి గ్యాంగ్ రేప్ ఘటనపై తీవ్రంగా స్పందించింది. నిందితులపై, ఈ వ్యవస్థపై బూతు కామెంట్లతో విరుచుకు పడింది. దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు తలుచుకుంటే....విశాఖ సింగ్ కు మాత్రమే కాదు, ఎవరికైనా అలానే కోపం వస్తోంది.
రోమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ గా హాజరైన ఇటీవలే ఇండియా తిరిగి వచ్చిన విశాఖ సింగ్.... దేశ రాజధానిలో చోటు చేసుకున్న భయంకరమైన గ్యాంగ్ రేప్ సంఘటన గురించి తెలిసి మండి పడింది. ఢిల్లీలో మూవింగ్ ఆటోలో మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ దేశం మొత్తాన్నిషాకైంది. ఈ ఘటనపై విశాఖ సింగ్ ట్వీట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు.
మహిళలపై దారుణాలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి....ఈ సొసైటీ, ఈ దేశంలోని పరిస్థితులే ఇందుకు కారణం. F**k you rapists! F**k the system అంటూ మండి పడింది. విశాఖ సింగ్ మాత్రమే కాదు, పలువురు మహిళలు ఈ ఘటనపై మండి పడ్డారు.
దేశ రాజధానిలో గత కొన్ని నెలలుగా మహిళలపై దారుణాలు పెరిగి పోతున్నాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకోవడానికి వ్యవస్థలోని లోపాలే కారణమని పలువురి వాదన. ముఖ్యంగా నిందితులకు సరైన శిక్ష పడటం లేదు. ఒక వేళ శిక్ష పడినా చాలా లేటవుతుంది. పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందనేది పలువురి వాదన.