Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టులో ఊరట
దక్షిణాది హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. నిర్మాతల మండలిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యాలు చేశారనే కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
దక్షిణాది హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. నిర్మాతల మండలిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యాలు చేశారనే కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంలో నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాలపై సస్సెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. మండలి విధించిన సస్సెన్షన్ ను సవాల్ చేస్తూ విశాల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబితే విశాల్ పై విధించిన వేటును ఉపసంహరించుకొంటామని విచారణ సందర్భంగా మండలి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అందుకు విశాల్ బేషరుతుగా క్షమాపణలు చెప్పారు.
కానీ ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎతివేయలేదు. సభ్యుడిగా మళ్లీ కమిటీలో చేర్చుకోలేదు. దాంతో మళ్లీ విశాల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం విశాల్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.
శుక్రవారం లోగా విశాల్ పై విధించిన సస్పెన్షన్ రద్దు చేయాలని, ఆయనను మళ్లీ కమిటీలో చేర్చుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విశాల్ విజయం సాధించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.