Don't Miss!
- News 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వీణ స్టెప్స్తో చిరంజీవినే ఇంప్రెస్ చేసింది...(ఫోటోస్, వీడియో)
హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా తెరకెక్కిన 'అఖిల్' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ సాయేషా సైగల్. ప్రముఖ హిందీ నటుడు దిలీప్కుమార్ మనవరాలే ఈ సాయేషా సైగల్. సినిమా పెద్ద ప్లాప్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న అఖిల్ తో పాటు సాయేషాకు కూడా నిరాశ తప్పలేదు.
'అఖిల్' దెబ్బకి అమ్ముడు టాలీవుడ్ నుండి ఔట్ కాక తప్పలేదు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఎక్కడా సాయేషా పేరు వినిపించలేదు. అయితే ఆమెకు ఇటీవలే బాలీవుడ్ చాన్స్ దక్కింది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'శివాయ్'తో సాయేషా హీరోయిన్ గా బాలీవుడ్ కు పరిచయం కాబోతోంది.
ఆ సంగతి పక్కన పెడితే...జూన్ నెలాఖరున సింగపూర్ లో జరిగిన 'సైమా' అవార్డుల వేడుకలో సాయేషా సైగల్ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె వేసిన చిరంజీవి వీణ స్టెప్ హైలెట్ అయింది. స్వయంగా చిరంజీవి ముందే తను ఈ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందని సాయేషా చెప్పుకొచ్చింది.
ఇది నాకు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. నేను చిరంజీవి సార్, బాలకృష్ణ సర్, వెంకటేష్ మరియు నాగార్జున్ సర్ సినిమాలు చూస్తూ పెరిగాను. నేను డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే సమయంలో చిరంజీవి సర్ ముందు వరుసలో కూర్చొని చూసారు. నా పెర్ఫార్మెన్స్ చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యానని చిరంజీవి సర్ చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని సాయేషా చెప్పుకొచ్చింది.
సాయేషా వీణ స్టెప్
సైమా అవార్డుల వేడుకలో సాయేషా వీణ స్టెప్...
అదిరిపోయే పెర్ఫార్మెన్స్
సైమా అవార్డుల వేడుకలో సాయేషా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
అఖిల్, సాయేషా
సైమా అవార్డుల వేడుకలో అఖిల్, సాయేషా, బన్నీ, సమంత తదితరులు...
అఖిల్ సినిమా ద్వారా
అఖిల్ సినిమా ద్వారా సాయేషా తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది.
దిలీప్ కుమార్ మనవరాలు
ప్రముఖ హిందీ నటుడు దిలీప్కుమార్ మనవరాలే ఈ సాయేషా సైగల్
అఖిల్ ప్లాప్
'అఖిల్' దెబ్బకి అమ్ముడు టాలీవుడ్ నుండి ఔట్ కాక తప్పలేదు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఎక్కడా సాయేషా పేరు వినిపించలేదు.
బాలీవుడ్లో
జయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'శివాయ్'తో సాయేషా హీరోయిన్ గా బాలీవుడ్ కు పరిచయం కాబోతోంది.
|
సాయేషా
జూన్ నెలాఖరున సింగపూర్ లో జరిగిన ‘సైమా' అవార్డుల వేడుకలో సాయేషా సైగల్ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో..