Don't Miss!
- News అధికార పార్టీకి షాక్ ఇచ్చిన ‘అఖండ’, దెబ్బకు ప్రతిపక్షంతో చేతులు కలిపిన మాస్ లీడర్ !
- Finance Gautam Adani: గౌతమ్ అదానీ జీవితాన్ని మార్చిన లేడీ డెంటిస్ట్.. ఆమె ఎవరంటే..??
- Sports KKR vs RR: రాజస్థాన్ చేతిలో ఓటమి.. గంభీర్ను ఓదార్చిన షారుఖ్ ఖాన్! వీడియో
- Travel ఇండియాలోని సమ్మర్లో వెళ్లకూడని సందర్శనీయ ప్రదేశాలివే!
- Lifestyle Egg Dum Biryani : గుడ్డుతో రుచికరమైన దమ్ బిర్యానీ..ఒకసారి రుచి చూస్తే మొత్తం మీరే లాగించేస్తారు
- Automobiles మార్కెట్లో లాంచ్ అయిన రూ.17.70 లక్షల బైక్ ఇదే!.. పూర్తి వివరాలు
- Technology Haier నుంచి నాలుగు కొత్త స్మార్ట్ టీవీలు! ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు
వరుణ్ తేజ్ ‘కంచె’ రిలీజ్ వాయిదా ఎందుకు?
హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కంచె'. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ ఏకంగా నెల రోజులు వాయిదా వేసారు. వాయిదాకు కారణం చెబుతానన్న వరుణ్ తేజ్ ఇప్పటి వరకు ఏ విషయం బయట పెట్టలేదు.
మరో వైపు ‘కంచె' సెన్సార్ కూడా పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ పూర్తయిందటే సినిమా షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లే. అయితే అన్నీ సవ్యంగా ఉన్నపుడు సమస్య ఏమిటి? అనేది మాత్రం తెలియడం లేదు.
నవంబర్ 6న ‘కంచె' విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే నెల రోజుల ముందుగానే సినిమా సెన్సార్ పూర్తి చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సినిమాపై ఎన్నో అంచనాలతో ఉన్న అభిమానుల విడుదల వాయిదా పడటంలో డీలా పడ్డారు. మరి వరుణ్ తేజ్ వీలైనంత త్వరగా వాయిదాకు గల కారణాలు బయట పెడితే అభిమానుల్లో అసంతృప్తి తగ్గుతుంది.
తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ఇది. ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిచింది.