Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మళ్ళీ సేమ్ సీన్ రిపీట్... ఈసారి మహేష్ బాబు ఏం చేస్తాడు ? మళ్ళీ త్యాగమేనా
పోయిన సంవత్సరం బాహుబలి వచ్చిన సమయం లో శ్రీమంతుడు కూడా వచ్చింది. రాజమౌళి మీద గౌరవంతోనో మరేకారనమో గానీ కొన్నాళ్ళు లేట్గానే రిలీజ్ చేసారు. అప్పటికీ బాహుబలి ప్రభావం ఇంకా తగ్గలేదు. సినిమా సూపర్ డూపర్ హిట్ అని కంఫార్మ్ అయ్యాకే శ్రీమతుడూ రిలీజ్ అయ్యింది. ఈ విషయంలో హిపోక్రసీలకు చోటు లేకుండా 'బాహుబలి'కి దారివ్వడానికే తన సినిమాను వాయిదా వేసుకున్నట్లు బహిరంగం గానే చెప్పాడు మహేష్ బాబు.
అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కిన చిత్రం తో పోటీపడి మరీ ఒక ప్రాంతీయ భాషలోనే ఒక రికార్డ్ స్థాయి వసూళ్లని సాధించటమే కాదు. లోకల్ సినిమా ఏమాత్రం తక్కువకాదనీ, మేసేజ్ ఉన్న సినిమాలు అవార్డులే కాదు లాభాలనూ తెచ్చిపెట్టగలవు అని నిరూపించింది. అయితే ఆతర్వాత మాత్రం బ్రహ్మోత్సవం దారునం గా దెబ్బతీసింది... ఇదే గనక బాహుబలి సమయం లో అయిఉంటే మహేష్ కి పెద్ద భాద ఉండేది కాదేమో కానీ ఏస్టార్ సినిమాలూ లేని సమయం లో కూడా భయంకరమైన ఫ్లాప్ పలకరించింది. అందుకే మరింత కసిగా తన రాబోయే సినిమా మీద దృష్టి పెట్టాడు మహేష్.
అది అక్కడితోనే అయిపోలేదు ఇప్పుడు వచ్చే ఏడాది కూడా మళ్లీ మహేష్ సినిమాకు మళ్లీ 'బాహుబలి'తో పోటీ పడాల్సిన పరిస్థితి తలెత్తింది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న కొత్త సినిమా రిలీజ్ డేట్ ఏప్రిల్ 14 అనుకుంటున్నారు. ఐతే అదే నెల 28న 'బాహుబలి-2' రాబోతోంది. ఐతే 'శ్రీమంతుడు' విషయంలో వెనక్కి తగ్గినట్లు మహేష్ ఈసారి తగ్గే అవకాశాలు లేవట. రెండు వారాల గ్యాప్ సరిపోతుందని.
అందులోనూ ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాది కావడంతో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆ తేదీకే రిలీజ్ చేసేయాలని ఫిక్సయ్యారట. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మెజారిటీ పార్ట్ పూర్తయింది. జనవరి నెలాఖరుకల్లా సినిమా పూర్తయిపోతుందని.. ఇంకో రెండున్నర నెలల్లో నెమ్మదిగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి అనుకున్న ప్రకారం సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలన్న ప్రణాళికతో ముందుకెళ్తోందట ఈ మూవీ టీం.