Don't Miss!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
‘రేసు గుర్రం’ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం: సురేందర్ రెడ్డి
హైదరాబాద్: కిక్ సినిమాకు సీక్వెల్ గా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘కిక్-2' ఇటీవల విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఊహించిన ఫలితాలను రాబట్టలేదు. మిక్డ్స్ రివ్యూలు, మిక్డ్స్ టాక్ వల్ల సినిమా కాస్త డీలా పడింది. అయితే ఈ సినిమా ఫలితం తనకు సంతృప్తిని ఇచ్చిందని అంటున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. త్వరలో ‘రేసు గుర్రం' చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించారు.
‘అల్లు అర్జున్తో ‘రేసుగుర్రం 2' చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. దీంతో పాటు కిక్-3 చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఈ సినిమాలకు స్టోరీ డిఫరెంటుగా ఉంటుంది. ఈ రెండు ఫ్రాంచైజీలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతాయని ఆశిస్తున్నట్లు సురేందర్ రెడ్డి వెల్లడించారు. ‘రేసు గుర్రం' చిత్రం 2014లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.
‘కిక్-2' సినిమాకు వస్తున్న రెస్పాన్స్ గురించి వెల్లడిస్తూ...‘ఆడియన్స్ కిక్-2 సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రివ్యూలు ఎలా ఉన్న స్పందన బావుంది. ఓపెనింగ్ వీకెండ్ లో వసూళ్లు బావున్నాయి' అన్నారు.
‘కిక్-2' సినిమా ఓపెనింగ్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 21.45 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.