Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కన్నడ శివరాజ్ కుమార్ తో యేలేటి చిత్రం
హైదరాబాద్ : దర్శకుడు యేలేటి చంద్ర శేఖర్ రీసెంట్ గా ఓ మల్టి లింగ్వల్ ఫిల్మ్ ని మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయిన కన్నడ వెర్షన్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. తమిళ,తెలుగు, మళయాళ వెర్షన్స్ లకు గానూ మేహన్ లాల్, గౌతమీ నటిస్తూండగా, కన్నడ వెర్షన్ కు గానూ శివరాజ్ కుమార్ ని తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈ మేరకు శివన్నతో చర్చలు జరిగినట్లు సమాచారం. శివన్నను కన్నడ వెర్షన్ కు తేవటం నిర్మాత సాయి కొర్రిపాటి ఆలోచన అని తెలుస్తోంది. శివన్న ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తో కిల్లర్ వీరప్పన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ఇప్పటికే చాలా క్రేజ్ వచ్చింది.
చిత్రం పూర్తి వివరాల్లోకి వెళితే..
జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్, విలక్షణ నటి గౌతమి ప్రధానపాత్రల్లో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఓ నూతన చిత్రం ప్రారంభంకానుంది. ‘ఐతే', ‘అనుకోకుండా ఒకరోజు', ‘ఒక్కడున్నాడు', ‘ప్రయాణం', ‘సాహసం' వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేయడమే కాకుండా తొలి చిత్రం ‘ఐతే'తో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
‘ఈగ', ‘అందాల రాక్షసి','లెజండ్', ‘ఊహలు గుసగుసలాడే', ‘దిక్కులు చూడకు రామయ్యా' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ‘ఈగ'తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ముగ్గురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ కలిసి పనిచేస్తన్న ఈ చిత్రం నవంబర్ 3వ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత సాయి కొర్రపాటి తెలియజేశారు.